MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Holidays for School : ఏపీలో దసరా సెలవులు పొడిగింపు ... అక్టోబర్ 17 వరకు స్టూడెంట్స్ కు హాలిడేస్

Holidays for School : ఏపీలో దసరా సెలవులు పొడిగింపు ... అక్టోబర్ 17 వరకు స్టూడెంట్స్ కు హాలిడేస్

అక్టోబర్ 2 నుండి 13 వరకు ఆంధ్ర ప్రదేశ్ లోో దసరా సెలవులు. అక్టోబర్ 14న విద్యాసంస్థలు పున:ప్రారంభం కావాలి. కానీ ఈ సెలవులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. ఎందుకంటే? 

4 Min read
Arun Kumar P
Published : Oct 15 2024, 11:21 AM IST| Updated : Oct 15 2024, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
AP Extends School Holidays Due to Heavy Rains

AP Extends School Holidays Due to Heavy Rains

దసరా సెలవులు ఇలా ముగియగానే అలా వర్షాలు సెలవులు మొదలయ్యాయి. అక్టోబర్ 2 నుండి 13 వరకు ఆంధ్ర ప్రదేశ్ లోని స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇచ్చారు. సోమవారం నుండి (అక్టోబర్ 14) నుండి స్కూళ్లు పున:ప్రారంభం కావాల్సింది. కానీ ఇంతలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు మొదలయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులను పొడింగించారు. ఈ సెలవులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.  

ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో పరిస్థితి బట్టి సెలవులు కొనసాగిస్తున్నారు. అయితే అల్పపీడనం కాస్త తుఫానుగా మారి మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో విద్యాసంస్థలకు సెలవులు కొనసాగించవచ్చు. అక్టోబర్ 17వరకు తుఫాను ప్రభావం వుంటుందని ... దీంతో ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కూడా విద్యాసంస్థలకు సెలవులు వుండనున్నాయి. 

25
AP Extends School Holidays Due to Heavy Rains

AP Extends School Holidays Due to Heavy Rains

ఏఏ జిల్లాల్లో సెలవులు : 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింత బలపడి తుఫానుగా మారనుంది... దీని ప్రభావంతో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇప్పటికే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... మరో రెండుమూడు  రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో శ్రీసత్యసాయి జిల్లాలో ఇప్పటికే అక్టోబర్ 15,16, 17 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ సెలవులకు సంబంధించి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారిక ప్రకటన చేసారు. తుఫాను ప్రభావాన్ని బట్టి మిగతా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోనున్నాయి.  

ఇక ఇప్పటికే దసరా సెలవులు ముగిసినా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు పున: ప్రారంభం కాలేవు. వర్షాల కారణంగా అక్టోబర్ 14 సోమవారం (నిన్న) తిరుపతితో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఇక ఇవాళ (అక్టోబర్ 15 మంగళవారం) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. మరో మూడురోజుల పాటు తుఫాను ప్రభావిత జిల్లాల్లో సెలవులపై సెలవులు ఇవ్వనున్నారు... దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.

పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  అన్నమయ్య జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... చెరువులు, జలాశయాలు, నీటి కుంటలు నిండిపోయాయి. కాబట్టి స్కూళ్లకు వెళ్లే సమయంలో విద్యార్థులు ప్రమాదాలకు గురికాకుండా సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు.
 

35
AP Extends School Holidays Due to Heavy Rains

AP Extends School Holidays Due to Heavy Rains

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు : 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత ఆదివారం మొదలైన వర్షాలు సోమవారం మరింత ఊపందుకున్నాయి. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విశాఖ, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఈ రెండురోజులు సెలవులు కొనసాగుతున్నాయి. 

తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురియగా మంగళవారం అంటే ఇవాళ రాజధాని హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, ముగులు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. పలుచోట్లు భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా కురవొచ్చు... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

ఇక బుధవారం కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి.  నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, వరంగల్,హన్మకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ తో పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురుస్తాయని ప్రకటించారు. 
 

 

45
AP Extends School Holidays Due to Heavy Rains

AP Extends School Holidays Due to Heavy Rains

బంగాళాఖాతంలో తుఫాను ... తీరం దాటేది ఎక్కడో తెలుసా? 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి బుధవారం తుఫానుగా మారనుంది. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇది తుఫానుగా మారి ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుందోనని ఇటు తెలుగు, అటు తమిళ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

అక్టోబర్ 12న దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడి పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ బలపడి అల్పపీడనంగా మారింది. ఇదికాస్తా ప్రస్తుతం అల్పపీడనంగా మారింది. రేపు (బుధవారం) వరకు ఇది తీవ్ర తుఫానుగా మారి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య  తీరం దాటవచ్చని ఐఎండి ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.   

తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు నదీతీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుంది... కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో తీరప్రాంతంలో  బలమైన ఈదురుగాలులు వీస్తాయి... కాబట్టి అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. 

55
Chandrababu Naidu

Chandrababu Naidu

మళ్లీ రంగంలోకి సీఎం చంద్రబాబు : 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ఎప్పుడూలేని విధంగా బుడమేరు ముంచెత్తింది. ఈ సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు వరదనీటిలోకి దిగి ప్రజలకు సహాయం అందించేందుకు చేసిన ప్రయత్నం అందరిచేత ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వరదలను మరిచిపోకముందే ఏపీపై మరో తుఫాను విరుచుకుపడుతోంది. దీంతో సీఎం చంద్రబాబు ముందస్తుగానే రంగంలోకి దిగారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది తుఫానుగా మారే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో మరిత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలు మరీముఖ్యంగా నీటి ప్రవాహాలు, చెరువులు, కుంటలు, జలాశయాల సమీపంలో నివాసముండే ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. 

ఈ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజల మొబైల్స్ కి మెసేజ్ ద్వారా అందించాలని... తద్వారా వారు జాగ్రత్త పడే అవకాశాలుంటాయని తెలిపారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ జిల్లాల్లో ఎన్డిఆర్ఎస్, ఎస్డిఆర్ఎప్ బృందాలను అందుబాటులో వుంచాలని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. 

ఇక నెల్లూరు జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలని  మంత్రి నారాయణ ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా వాటర్ ట్యాంకులు, జనరేటర్లు, ట్రాక్టర్లని ముందుగా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆహారం, తాగునీరు వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్స్ కి విజయవాడ నుంచి ఆదేశాలిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved