గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
గురునానక్ జయంతి వేడుకల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సోమవారం నాడు నగరంలోని గురునానక్ కాలనీలో గురుద్వార్ లో గురునానక్ 551 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
గురునానక్ జయంతి వేడుకల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సోమవారం నాడు నగరంలోని గురునానక్ కాలనీలో గురుద్వార్ లో గురునానక్ 551 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
గురునానక్ ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ కు ట్రస్టు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆదివారం నుండి గురునానక్ జయంతి వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
సోమవారం నాడు గురునానక్ జయంతి వేడుకల్లో మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, దేవినేని అవినాష్, వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ లు పాల్గొన్నారు.