జగన్ మూడు రాజధానులపై కేంద్రం పక్కా వ్యూహం
వరుస సంఘటనలను, పరిస్థితులను నిశితంగా గమనించిన వారెవ్వరికీ కూడా గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం షాకింగ్ పరిణామంగా అనిపించదు.

<p>ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు గత కొన్ని రోజులుగా వేగంగా మారిపోతున్నాయి. సోము వీర్రాకు బీజేపీ అధ్యక్షుడు అయింది లగాయతు మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పులనుమనం గమనించవచ్చు. </p>
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు గత కొన్ని రోజులుగా వేగంగా మారిపోతున్నాయి. సోము వీర్రాకు బీజేపీ అధ్యక్షుడు అయింది లగాయతు మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పులనుమనం గమనించవచ్చు.
<p>సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బీజేపీలోని సోమువీర్రాజు వర్గం కూడా ఈ స్థాయిలో సంబరాలు చేసుకొని ఉండరు. ఆ స్థాయిలో సంబరాలను జరిపారు వైసీపీ శ్రేణులు. </p>
సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బీజేపీలోని సోమువీర్రాజు వర్గం కూడా ఈ స్థాయిలో సంబరాలు చేసుకొని ఉండరు. ఆ స్థాయిలో సంబరాలను జరిపారు వైసీపీ శ్రేణులు.
<p>ఇక ఆయన బీజేపీ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడం మీడియా అంతా ఆ కవేరజే లో బిజీగా ఉండగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా పునర్నియమిస్తూ జగన్ ప్రభుత్వం,ఉత్తర్వులను ఇచ్చింది. ఆయన బాధ్యతలను స్వీకరించారు కూడా. </p>
ఇక ఆయన బీజేపీ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడం మీడియా అంతా ఆ కవేరజే లో బిజీగా ఉండగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా పునర్నియమిస్తూ జగన్ ప్రభుత్వం,ఉత్తర్వులను ఇచ్చింది. ఆయన బాధ్యతలను స్వీకరించారు కూడా.
<p>ఈ వ్యవహారం కూడా సాగుతుండగానే గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేశారు. మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో వైసీపీ వర్గాలు తమ పంతం నెగ్గించుకున్నట్టుగా సంబరాలు చేసుకుంటుంటే... ప్రతిపక్ష టీడీపీ వారు దీన్ని ఊహించని పరిణామం అంటున్నారు. </p>
ఈ వ్యవహారం కూడా సాగుతుండగానే గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేశారు. మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో వైసీపీ వర్గాలు తమ పంతం నెగ్గించుకున్నట్టుగా సంబరాలు చేసుకుంటుంటే... ప్రతిపక్ష టీడీపీ వారు దీన్ని ఊహించని పరిణామం అంటున్నారు.
<p>ఈ అన్ని సంఘటనలను పరిశీలిస్తే వేర్వేరు సంఘటనలుగా కనబడుతున్నప్పటికీ... ఇవన్నీ ఒకదానికొకటి ముడి పడి ఉన్న సంఘటనలే. వరుస సంఘటనలను, పరిస్థితులను నిశితంగా గమనించిన వారెవ్వరికీ కూడా గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం షాకింగ్ పరిణామంగా అనిపించదు. </p>
ఈ అన్ని సంఘటనలను పరిశీలిస్తే వేర్వేరు సంఘటనలుగా కనబడుతున్నప్పటికీ... ఇవన్నీ ఒకదానికొకటి ముడి పడి ఉన్న సంఘటనలే. వరుస సంఘటనలను, పరిస్థితులను నిశితంగా గమనించిన వారెవ్వరికీ కూడా గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం షాకింగ్ పరిణామంగా అనిపించదు.
<p>షాకింగ్ అనిపించకపోవడంతోపాటుగా.... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి హామీ ఉందనేది కూడా సుస్పష్టం. మూడు రాజధానుల అంశం గురించి కేంద్రం దగ్గర ముందస్తు సమాచారం ఉంది. కొద్దిగా లాజిక్ ని ప్రయోగిస్తే మనకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. </p>
షాకింగ్ అనిపించకపోవడంతోపాటుగా.... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి హామీ ఉందనేది కూడా సుస్పష్టం. మూడు రాజధానుల అంశం గురించి కేంద్రం దగ్గర ముందస్తు సమాచారం ఉంది. కొద్దిగా లాజిక్ ని ప్రయోగిస్తే మనకు కూడా ఈ విషయం అర్థమవుతుంది.
<p style="text-align: justify;">పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని తీసుకోండి. బీజేపీతో పొత్తుకు ముందు అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఏస్థాయిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు తోడుగా ఉంటాను అని అన్నాడు. కానీ పొత్తు పెట్టుకున్న తరువాత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. </p>
పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని తీసుకోండి. బీజేపీతో పొత్తుకు ముందు అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఏస్థాయిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు తోడుగా ఉంటాను అని అన్నాడు. కానీ పొత్తు పెట్టుకున్న తరువాత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు.
<p>అమరావతి ఉద్యమం మొదలుపెట్టి 200 రోజులైనా సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. చాలా మంది నేతలు వర్చ్యువల్ గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ వాదనను వినిపించారు. </p>
అమరావతి ఉద్యమం మొదలుపెట్టి 200 రోజులైనా సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. చాలా మంది నేతలు వర్చ్యువల్ గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ వాదనను వినిపించారు.
<p>చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడకు రాలీకపోయాడు. కనీసం విడియోద్వారా అయినా తన సందేశాన్ని పంపించొచ్చు కదా.. ? కానీ ఆ పని చేయలేదు. బహుశా కేంద్రం నుంచి అందిన సూచనల మేరకు ఆయన తప్పుకొని ఉండొచ్చు. కేంద్రం మూడు రాజధానులు అనుకూలంగా ఉన్నందున ఇది వారి పొత్తుకు విఘాతం కలిగించకూడదు అని పవన్ దూరంగా ఉన్నాడు. </p>
చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడకు రాలీకపోయాడు. కనీసం విడియోద్వారా అయినా తన సందేశాన్ని పంపించొచ్చు కదా.. ? కానీ ఆ పని చేయలేదు. బహుశా కేంద్రం నుంచి అందిన సూచనల మేరకు ఆయన తప్పుకొని ఉండొచ్చు. కేంద్రం మూడు రాజధానులు అనుకూలంగా ఉన్నందున ఇది వారి పొత్తుకు విఘాతం కలిగించకూడదు అని పవన్ దూరంగా ఉన్నాడు.
<p>పవన్ కళ్యాణ్ విషయాన్నీ పక్కకు పెట్టినా.... రాజధానుల ఏర్పాటు జగన్ చేతుల్లోనే ఉంటుంది. కానీ హై కోర్టును తరలించడం అంత తేలికైన పనికాదు. కేంద్రం సహకారం లేకుండా జగన్ ఆ పని చేయలేరు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితోపాటుగా ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయము అవసరమవుతుంది. </p>
పవన్ కళ్యాణ్ విషయాన్నీ పక్కకు పెట్టినా.... రాజధానుల ఏర్పాటు జగన్ చేతుల్లోనే ఉంటుంది. కానీ హై కోర్టును తరలించడం అంత తేలికైన పనికాదు. కేంద్రం సహకారం లేకుండా జగన్ ఆ పని చేయలేరు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితోపాటుగా ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయము అవసరమవుతుంది.
<p>ఇవన్నీ తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును మార్వాడానికి సిద్ధపడ్డాడు అంటే.... జగన్ కు ఈ విషయమై కేంద్రం నుంచి హామీ అంది ఉంటుంది. అందునా జగన్ ఏ పని చేసినా కేంద్ర పెద్దలకు చెప్పే చేస్తాడని స్వయంగా పార్టీలోని నెంబర్2 విజయసాయి రెడ్డే చెప్పారు. </p>
ఇవన్నీ తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును మార్వాడానికి సిద్ధపడ్డాడు అంటే.... జగన్ కు ఈ విషయమై కేంద్రం నుంచి హామీ అంది ఉంటుంది. అందునా జగన్ ఏ పని చేసినా కేంద్ర పెద్దలకు చెప్పే చేస్తాడని స్వయంగా పార్టీలోని నెంబర్2 విజయసాయి రెడ్డే చెప్పారు.
<p>ఈ అన్ని పరిస్థితుల్లో కేంద్రానికి జగన్ నిర్ణయాల గురించి ముందే తెలుసు. వారి ఆశీస్సులు కూడా ఈ నిర్ణయానికి దక్కిన తరువాతే జగన్ ముందుకెళ్లాడు. రానున్న రోజుల్లో సైతం ఇది కొనసాగుతుంది. అలా అని టీడీపీని దూరం చేసుకుంటారని కాదు. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసీపీతో అవసరం గనుక ఈ పద్ధతి. భవిష్యత్తులో 2024లో ఎవరితో అవసరం వస్తుందో తెలియదు కనుక వారి సమదూర సిద్ధాంతాన్ని అవలంబిస్తూనే ఉంటారు..!</p>
ఈ అన్ని పరిస్థితుల్లో కేంద్రానికి జగన్ నిర్ణయాల గురించి ముందే తెలుసు. వారి ఆశీస్సులు కూడా ఈ నిర్ణయానికి దక్కిన తరువాతే జగన్ ముందుకెళ్లాడు. రానున్న రోజుల్లో సైతం ఇది కొనసాగుతుంది. అలా అని టీడీపీని దూరం చేసుకుంటారని కాదు. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసీపీతో అవసరం గనుక ఈ పద్ధతి. భవిష్యత్తులో 2024లో ఎవరితో అవసరం వస్తుందో తెలియదు కనుక వారి సమదూర సిద్ధాంతాన్ని అవలంబిస్తూనే ఉంటారు..!