MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుంది. ఎలాగో తెలుసా?

రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుంది. ఎలాగో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది తెదేపా - జనసేన కూటమి ప్రభుత్వం. వాట్సాప్ ఉపయోగించి ఎంత ధాన్యం అయినా సులభంగా అమ్మే విధంగా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 17 2024, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 73373 59375 నెంబర్ ను రైతుల సేవల కోసం కేటాయించామన్నారు. ధాన్యం అమ్మదలచిన రైతులు ఈ నెంబర్ కు Hi అని సందేశం పంపితే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ రైతులతో మాట్లాడుతుందని తెలిపారు. ఈ వాయిస్ తెలుగులోనే ఉంటుందని, ధాన్యం విక్రయానికి సంబంధించి అన్ని విధాలుగా మార్గదర్శకం చేస్తుందని తెలిపారు.

24


ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ వివరించారు.

"రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత..  రైతు పేరును ధృవీకరించాలి. 

అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరు సెలక్ట్ చేసుకోవాలి. 

తరువాత ధాన్యం అమ్మదలిచిన తేదీ సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించాలి. 

అనంతరం టైమ్ కూడా సెలెక్ట్  చేయాలి.

ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్ముతున్నారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరంఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారో తెలియజేయాలి. 

అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు ఒక కూపన్ కోడ్ వస్తుంది.

34

ఈ విధంగా రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఇందులో ఎలాంటి బాదరబందీ ఉండదు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం.

ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.  ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

44

ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్

"సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో సర్వీస్ చేస్తోంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి" అని మనోహర్ పేర్కొన్నారు.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
Recommended image2
Now Playing
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu
Recommended image3
Now Playing
Vidadala Rajini Serious: పోలీసులే ఈ హత్యలు చేయిస్తున్నారు | Salman Murder Case | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved