MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Andhra Pradesh: తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Andhra Pradesh: సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చీఫ్ జస్టిస్ రమణకు వేదపండితులు స్వాగతం పలికారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Mar 06 2022, 12:17 PM IST| Updated : Mar 06 2022, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దర్శనానంతరం ఆయనకు వేదశీర్వచనం అందించి తీర్థప్రసాదాలతో పాటు ఇటీవల విడుదల చేసిన అంజనాద్రి-హనుమాన్ జన్మస్థలం పుస్తకాన్ని చైర్మన్ మరియు ఈవో అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేఐ.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భక్తులకు సర్వ దర్శనం పునఃప్రారంభం కావడం గొప్ప విషయమన్నారు. "భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాధులు మళ్లీ రాకుండా చూసేలా ప్రపంచాన్ని రక్షించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను" అని ఆయన పేర్కొన్నారు.
 

25

పరిశుభ్రతతో పాటు తిరుమల పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆయన శ్రీ బేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని కుటుంబ సమేతంగా అఖిలాండం వద్ద పూజలు చేశారు. స్థానిక శాసనసభ్యులు బి కరుణాకర్ రెడ్డి, సివిఎస్‌వో  గోపీనాథ్ జట్టి, డివైఇఓలు హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

35

అంత‌కు ముందు మహా ద్వారం వద్దకు చేరుకున్న సీజేఐ ఎన్వీ ర‌మ‌ణతో స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి లు స్వాగతం పలికారు. శాలువా కప్పి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను సత్కరించారు.
 

45

Andhra Pradesh: దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుప‌తి వెంక‌న్న‌కు పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు  చేశారు. సీజేఐ కుటుంబ స‌భ్యుల‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
 

55

జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల రావడంతో ఆయన పద్మావతి అతిధి గృహంలో పంచగవ్వ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈరోజ మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి తిరుచానూరులోని పద్మావతి ఆలయాన్ని సందర్శిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Cyclone Ditwah: నెల్లూరుజిల్లాలో సైక్లోన్ ఎఫెక్ట్ జాయింట్ కలెక్టర్ హెచ్చరిక | Asianet News Telugu
Recommended image2
Now Playing
Cyclone Ditwah: రానున్న 24 గంటల్లో ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక| Asianet News Telugu
Recommended image3
Now Playing
Janasena Leader Sensational Comments: ఆంబోతుకు రంకెలెక్కువ అంబటికి నోరెక్కువ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved