Asianet News TeluguAsianet News Telugu

బన్నీని కాదని మహేష్ కు ఓకే చెప్పిన విజయశాంతి.. కారణం?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు. దీనితో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 

Vijayashanti opts Mahesh Babu over Allu Arjun movie
Author
Hyderabad, First Published Jun 4, 2019, 2:42 PM IST

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు. దీనితో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం విజయశాంతి రీఎంట్రీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం కంటే ముందుగానే ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం విజయశాంతికి వచ్చిందట. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా విజయశాంతిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పేరు ప్రస్తావించకుండా విజయశాంతి ఈ విషయాన్ని తెలిపారు. ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించలేదని విజయశాంతి గతంలో తెలిపారు. 

మరికొందరి వాదన ప్రకారం మహేష్ సినిమాలో నటించేందుకే విజయశాంతి అల్లు అర్జున్ సినిమాని రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ పాత్రలోకి సీనియర్ హీరోయిన్ టబుని ఎంపిక చేసుకున్నారు. సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నాననే ఊహాగానాలని విజయశాంతి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. 

త్వరలో సరిలేరు నీకెవ్వరు చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపిస్తాడు. రష్మిక మందన హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios