కృతి శెట్టితో సినిమా చేయను.. విజయ్ సేతుపతి నిర్ణయం, ఉప్పెన టైంలో ఏం జరిగిందంటే
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన విజయ్ సేతుపతి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించాడు.
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన విజయ్ సేతుపతి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
విజయ్ సేతుపతి నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'లాభం'. ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా శృతి హాసన్ నటించింది. తాజాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉప్పెన తర్వాత తమిళంలో ఓ చిత్రం చేశాను. ఆ మూవీకి నిర్మాతలు, డైరెక్టర్ హీరోయిన్ గా కృతి శెట్టిని అనుకున్నారు. ఆమె ఫోటో నాకు పంపారు. వెంటనే నేను ఆ హీరోయిన్ వద్దు అని చెప్పాను. ఉప్పెన చిత్రంలో నేను ఆమెకు తండ్రిగా నటించిన సంగతి వాళ్లకు తెలియదు.
ఆ చిత్రంలో ఆమెకు తండ్రిగా నటించిన వెంటనే రొమాన్స్ చేయమంటే ఎలా.. అందుకే వద్దని చెప్పాను. ఉప్పెన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నప్పుడు కృతి శెట్టి కంగారు పడింది. ఎందుకు కంగారు పడుతున్నావు. నాకు నీ వయసున్న కొడుకు ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. భయపడకు అని చెప్పాను.
కాబట్టి కూతురిలా భావించే కృతి శెట్టికి జోడిగా నటించడం నావల్ల కాదు అని విజయ్ సేతుపతి తెలిపారు. ఇక లాభం చిత్రంలో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా నటించాడు. దళారీ వ్యవస్థ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ చిత్రం ఉండబోతోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.