రెండేళ్ల తర్వాత తెలుగులో తాప్సీ.. ఆమె లీడ్ రోల్తో `మిషన్ ఇంపాజిబుల్`
చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసింది తాప్సీ. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసింది తాప్సీ. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో రూపొందుతున్న `మిషన్ ఇంపాజిబుల్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఆమె ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
`ఈ చిత్రానికి `మిషన్ ఇంపాజిబుల్` అనే టైటిల్ తోపాటు ఇటీవల విడుదల చేసిన థీమ్ పోస్టర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. `గేమ్ ఓవర్` సినిమాలో చివరగా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తెలుగులో `మిషన్ ఇంపాజిబుల్` సినిమాలో లీడ్రోల్లో నటిస్తుండటం విశేషం. ఈ రోజు నుండి `మిషన్ ఇంపాజిబుల్` షూటింగ్లో జాయిన్ అయ్యారు తాప్సీ. అలాగే చేతికి కట్టుతో ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశాం. ఇది ఆకట్టుకుంటుంది` అని యూనిట్ తెలిపింది.
తాప్సీ పన్ను మాట్లాడుతూ, `గత 7 సంవత్సరాలుగా ఒక ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. `మిషన్ ఇంపాజిబుల్` అలాంటి చిత్రాల్లో ఒకటి. ఆకట్టుకునే కథాంశం, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ లాంటి మంచి టీమ్ కావడంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నా. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాలలో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోగలనని నమ్ముతున్నా` అని అన్నారు. ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు, రవితేజ గిరిజల ఎడిటర్.