సారాంశం

పుష్ప 2 ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాడు. ఈక్రమంలో రిహాబిలిటేషన్ లో కోలుకుంటున్న ఆ బాలుడిని నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్యపరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు . 
 

పుష్ప2 రిలీజ్ సందర్భంగా  సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. రీసెంట్ గా ఆ బాలుడిని  కిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంత కాలం హాస్పిటల్ లో ఉండటంతో శ్రీతేజ మానసిక పరిస్థితిని పర్యావేక్షించడానికి  హైదరాబాద్‌లోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. 

అక్కడ ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో శ్రీతేజ్ శరీరంగా, మానసికంగా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు అందుకుంటున్నాడు. దాదాపు 5 నెలలు గా హాస్పిటల్ లో ఉన్నాడు శ్రీతేజ్. ఈక్రమంలో  సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తో కలిసి శ్రీతేజను పరామర్శించేందుకు వెళ్ళారు.  రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లిన అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

శ్రీతేజ ఇంకా మాట్లాడే పరిస్తితి లేకపోవడంతో  డాక్టర్లతో మాట్లాడి ట్రీట్‌మెంట్ జరిగే విధానం గురించి కనుక్కోన్నారు. ట్రీట్మెంట్  ఎలా కొనసాగుతుందనే విషయాన్ని స్పెషలిస్ట్ లు నిర్మాతకు వివరంగా చెప్పారు. ఇంకా ఎంత కాలం ట్రిట్మెంట్ అవసరం అవుతుందో అడిగి తెలుసుకున్నారు. 

శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి అటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉన్నారు.  కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినప్పటి నుంచి  ప్రతి రోజూ తన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి ఖర్చుల భారం లేకుండా, ఆసుపత్రి బిల్లులు, చికిత్స ఖర్చులను హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్‌ నిర్మాతలు కలసి భరిస్తున్నారు. అంతే కాదు శ్రీతేజ కుటుంబానికి 2 కోట్ల పరిహారం కూడా అందించారు.