దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్ లో హిందీ రీమేక్ గా రూపొందిన చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రం విడుదల కోసం నార్త్ అభిమానులు ఎదురుచూస్తుండగా.. మరోసారి వాయిదాతో వారికి భారీ షాక్ ఎదురైంది.    

ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన `జెర్సీ` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. హిందీలోనూ ఆయనే తెరక్కెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రం 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో  ఎంపికవడం పట్ల బాలీవుడ్ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని (Nani), హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించారు. 2019లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.  

హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), మృణాల్ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ‘జెర్సీ’ మూవీ కోసం నార్త్ ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వరుసగా వాయిదాలు పడుతూనే వస్తోంది. మూడు ప్రధాన కోవిడ్-19 పరిస్థితులను లాక్‌డౌన్‌ల నుండి బయటపడిన తర్వాత  ఈ వచ్చే వారం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ మేకర్స్ ఉన్నట్టుండి మరో వారంపాటు రిలీజ్ కు వాయిదా వేశారు. వారం తర్వాత విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో షాహిద్ అభిమానులు, ప్రేక్షకులు కొంత డిజపాయింట్ అవుతున్నారు.

ఈ వాయిదాకు కారణం.. సినిమాల టైట్ పొజిషన్‌నే అర్థమవుతోంది. ఇప్పటికే మల్టీస్టారర్, భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’RRR ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రధానంగా, కన్నడ బ్లాక్ బాస్టర్, మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2)  కూడా అదే రోజు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.  ఈ  రెండు భారీ చిత్రాల నడుమ జెర్సీ తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 22కి రిలీజ్ డేట్ ను మార్చేశారు. ఈ  సారి మాత్రం పక్కా రిలీజ్ చేస్తామని అంటున్నారు మేకర్స్.. ఇక పోతే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి Gowtam Tinnanuri రామ్ చరణ్  కాంబినేషనల్ లోనూ ఓ క్రేజీ  ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సినిమా తర్వాత చెర్రీ ప్రాజెక్ట్ పైనే గౌతమ్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.