సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్.. `టైగర్` డైరెక్టర్తో నయా మూవీ
తనకు `టైగర్` లాంటి సినిమాని అందించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్నారు. కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది.
ఇటీవల `ఏ1 ఎక్స్ ప్రెస్`తో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ తన బర్త్ డే (మే7) సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించారు. తనకు `టైగర్` లాంటి సినిమాని అందించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్నారు. కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది. కాన్సెప్ట్ వైజ్గా దర్శకుడు వీఐ ఆనంద్కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్కు టైగర్ ఒక కొత్త తరహా చిత్రం. ముఖ్యంగా సందీప్ కిషన్ పవర్ప్యాక్డ్ యాక్షన్ ఆడియన్స్ను ఎట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు.
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత హీరో సందీప్కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో మరో మూవీ గా వస్తున్న ఈ చిత్రం కథ, కథనాలపై ఇండస్ట్రీలో అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలైయ్యాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్లో సందీప్కిషన్ ఏదో ఒక మిస్టీరియస్ లొకేషన్ను ఐడెంటీఫై చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. విభిన్న తరహా కథ, కథనాలు అందించే దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు కూడా ఓ వినూత్నమైన, ప్రేక్షకులు ఊహించని కథను రెడీ చేశారు.
హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ గుట్ట ఈ సినిమాకు సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ `గల్లీరౌడీ` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి జి. నాగేశ్వరరావు దర్శకుడు. దీంతోపాటు మహేష్ కోనేరు దర్శకత్వంలో తన 27వ చిత్రాన్ని చేస్తున్నాడు సందీప్ కిషన్. తన బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.