Asianet News TeluguAsianet News Telugu

సాయి తేజ్‌కు కరోనానా?..సరే మరి ఈ ఫొటో ఏంటి ?

వాస్తవానికి టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. కోలుకున్నారు. కాకపోతే కొందరు సైలెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మరికొందరి వివరాలు మెల్లిగా బయిటకు వచ్చాయి.  మెగా ఫ్యామిలీలో నాగబాబుకి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. నాగబాబు దీనికి చికిత్స తీసుకొని కరోనాని జయించాడు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా సోకింది. 

Sai Teja check to Corona virus infect rumors
Author
Hyderabad, First Published Oct 6, 2020, 9:40 PM IST

 సాయి ధరమ్ తేజ్‌కు కరోనా సోకిందని  ఉదయం నుంచి మీడియాలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ రూమర్స్ కు డైరక్ట్ గా ఒక్క ఫొటో షేర్ చేసి చెక్ చెప్పారు సుప్రీం హీరో.
 
వాస్తవానికి టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. కోలుకున్నారు. కాకపోతే కొందరు సైలెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మరికొందరి వివరాలు మెల్లిగా బయిటకు వచ్చాయి.  మెగా ఫ్యామిలీలో నాగబాబుకి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. నాగబాబు దీనికి చికిత్స తీసుకొని కరోనాని జయించాడు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా సోకింది. అయితే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని రూమర్లు  మొదలయ్యాయి.  కరోనా పాజిటివ్ రావడంతో సాయి ధరమ్ తేజ్ సెల్ఫ్ అసోలేషన్‌లోకి వెళ్లిపోయారని కూడా అనేసారు. 

ఈ రూమర్స్ కు ఓ  కారణం కూడా ఉంది. తేజూ హీరోగా వస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. దీంతో తేజ్‌కు కరోనా సోకడం వల్లే డబ్బింగ్ పనులు వాయిదా వేశారని అనేసారు.

అయితే, ఈ పుకార్లన్నింటికీ సాయి తేజ్ ఒక్క ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టే  ప్రయత్నం చేసారు. ఈ రూమర్లు మొదలైన కొద్దిసేపటికే తేజూ స్పందించారు. దర్శకుడు దేవా కట్టతో చేయబోయే తన తరవాత సినిమాకు సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్‌ను తేజూ ట్వీట్ చేశారు. ‘‘#SD14 కోసం ప్రిపరేషన్ ప్రారంభమైంది. దేవా కట్ట గారు తన రచనతో రక్తి కట్టిస్తున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాం’’ అని తేజూ తన ట్వీట్‌లో పేర్కొ్న్నారు. అంతేకాదు, తాను ఫిట్‌గా ఉన్నట్టు తెలియజేడానికి బైసెప్స్ ఎమోజీని కూడా పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios