మిషన్ ఇంపాజిబుల్ డైరెక్టర్ తో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, ఆస్కార్ లో మెరిసిన జక్కన్న
హాలీవుడ్ లో తళుక్కున మెరిసారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. అవార్డ్ ల వేడుకలో ప్రత్యేకంగా కనిపించారు. దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు స్టార్ డైరెక్టర్.
లాస్ఏంజెల్స్లో సందడి చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ దర్శకుడు రాజమౌళి. అక్కడ జరుగుతున్న గవర్నర్స్ అవార్డు వేడుకకు టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. అక్కడ ఆయన మిషన్ ఇంపాజిబుల్ డైరెక్టర్ జె.జె.అబ్రమ్స్ను కలిశాడు. స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్ 3 వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన అబ్రమ్స్ తో జక్కన్న ఫోటో దిగారు.
ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో వెల్లడించారు. రాజమౌలి, అంబ్రాస్ కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేవారు టీమ్. ఇక ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గామారింది. అంతే కాదు ఈ ట్వీట్ కు రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికితీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి... భారతజాతికి గర్వకారం అంటూ అభిమానులు కామెట్లు పెడుతున్నారు.
అస్కార్ అవార్డులకు ముందు జరిగే సినిమా వేడుక గవర్నర్స్ అవార్డ్.. ప్రస్తుతం లాస్ ఎంజెల్స్ లో ఈ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఆస్కార్కి నామినేట్ అయిన సినిమా దర్శకులు, హీరోలు, హీరోయిన్లు అందరూ ఈ అవార్డు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ అవార్డు ఈవెంట్తో ఆస్కార్ క్యాంపెయిన్ ఊపందుకుంటుంది. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ సారి 14 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ దాఖలు చేసింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటీష్ మోడల్ ఓలీవియో నటించారు. వీరితో పాటు ఈసినిమాలో సముద్రఖని, శ్రియా శరణ్తో పాటు బాలీవుడ్ హీరో అజయ్దేవ్గన్ నటించారు.ఇప్పటికీ ఏదో ఒక రికార్డ్ సాధిస్తూనే ఉంది ట్రిపుల్ ఆర్.