రామ్‌చరణ్‌కి సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతుంది. పలు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన అభిమానులకు శ్రీరామనవమి ట్రీట్‌ ఇవ్వబోతున్నారట చరణ్‌.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రామ్‌చరణ్‌(Ram Charan). ఈ చిత్రంలో తన పాత్ర బాగా హైలైట్‌ కావడంతో లోలోపల ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అందుకు నిదర్శనమే `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) టీమ్‌కి బంగారు కానుకలివ్వడం, పైగా ప్రమోషన్‌లో భాగంగా ఒక్కరే థియేటర్లు తిరుగుతూ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదలయ్యాక కేవలం రామ్‌చరణ్‌ హడావుడి మాత్రమే కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ కేవలం ఓ నోట్‌తోనే సరిపెట్టాడు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌ వార్తలు సైతం మరింత హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌కి సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతుంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు చెర్రీ. `ఆర్‌సీ15`(RC15) వర్కింగ్‌ టైటిల్‌తో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే దాదాపు రెండు మేజర్‌ షెడ్యూల్స్ పూర్తయ్యాయని టాక్‌. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` హడావుడి పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు చరణ్‌. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రామ్‌చరణ్‌ తన అభిమానులకు శ్రీరామనవమి ట్రీట్‌ ఇవ్వబోతున్నారట. ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే ఆలోచనలో యూనిట్‌ ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని తెలుస్తుంది. యంగ్‌ సీఎంగా చరణ్‌ కనిపించబోతున్నారట. అంతేకాదు ఇందులో ఆయన మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. గతంలో `మగధీర`లో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. అయితే అది పూనర్జన్మల కథ. దీంతోపాటు `నాయక్‌`లో డబుల్‌ రోల్స్ చేశారు చరణ్‌.

మరోవైపు గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నారు రామ్‌చరణ్‌. అలాగే బాలీవుడ్‌లోనూ కథ చర్చలు జరుగుతున్నాయి. రెండు పెద్ద బ్యానర్లకి కమిట్‌ అయినట్టు టాక్‌. ఇక ఎన్టీఆర్‌తో కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మార్చి 25న విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు రూ900కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా రన్‌ అవుతుంది. ఇందులో చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా నటించిన విషయం తెలిసిందే.