Asianet News TeluguAsianet News Telugu

రాజ్ తరుణ్ టీజర్ లో .. మంచు విష్ణుకి గుచ్చుకునేలా సెటైర్ వేసారే !

  విష్ణు మాట తడబడింది. కందుకూరి అన్నంత వరకు ఓకే కానీ.. తర్వాత వీరేహం పకాహం అంటూ ఏదో అనేశాడు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దాని మీద బోలెడన్ని మీమ్స్ చేసి వదిలేశారు. తాజాగా రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓ వెబ్ సీరిస్ లోనూ మళ్లీ అదే మాటిని వాడి నవ్వించే ప్రయత్నం చేసారు.

Raj Tharun, Shivaani Rajashekhar Aha Na Pellanta Releasing on Nov 17th
Author
First Published Nov 1, 2022, 8:10 AM IST


ట్రోలింగ్ లకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన మంచు విష్ణు ఆ మధ్యన   మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటి చేసిన నేపథ్యంలో మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ అయ్యాయి.   తన ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్‌కు తెలుగు వారి గురించి తెలిసింది శూన్యమని అన్నాడు విష్ణు. అంతటితో ఆగకుండా ప్రకాష్ రాజ్.. కందుకూరి వీరేశలింగం పంతులు గురించి చెప్పాలని అన్నాడు.

కానీ ఇక్కడ విష్ణు మాట తడబడింది. కందుకూరి అన్నంత వరకు ఓకే కానీ.. తర్వాత వీరేహం పకాహం అంటూ ఏదో అనేశాడు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దాని మీద బోలెడన్ని మీమ్స్ చేసి వదిలేశారు. ఆ మాట ఎంత పాపులర్ అయ్యింది అంటే...తాజాగా రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓ వెబ్ సీరిస్ లోనూ మళ్లీ అదే మాటిని వాడి నవ్వించే ప్రయత్నం చేసారు. మీరూ ఆ టీజర్ చూడండి..టీజర్ చివర్లో ఆ డైలాగు ఉంటుంది.
  
హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్ 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ లో ఓటీటీ లో సందడి చేయనున్నారు. రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'అహ నా పెళ్ళంట' టీజర్ ను ఇటీవల జి5 సంస్థ విడుదల చేసింది. ఈ టీజర్ వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచేలా ఉందనే చెప్పాలి. హీరో చిన్నప్పుడే ఏ అమ్మాయిని చూడకూడదు అని తల్లి ఒట్టు వేయించుకుంటుంది. అయితే విచిత్రంగా హీరో అమ్మాయిలను చూసిన ప్రతీ సారీ ఏదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో అతను అమ్మాయిల వైపు చూడటమే మానేస్తాడు. చివరకు పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడమని హీరో ఇంట్లో చెప్తే.. తీరా పెళ్లి ఫిక్స్ అయ్యాక తన లైఫ్ లోకి ఇంకో రావడంతో కథ మళ్ళీ మలుపు తిరుగుతుంది. అప్పుడు హీరో పరిస్థితి ఏంటి అనే అంశం పై ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే..

మొత్తంగా టీజర్ చూస్తుంటే సిరీస్ ఎంత ఫన్నీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఇందులో ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాన్స్.. ఇలాంటి అన్ని అంశాలు  పుష్కలంగా ఉండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’ జీ5, తమాడా మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. యూత్, ఫ్యామిలీ, లవ్, కామెడి ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటి ఆమని, హర్షవర్థన్, పోసాని, మధుసూధన్ తదితరులు ప్రధాన పాత్రలు గా చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందనుంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 17 నుంచి జి5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios