హిందీలో బిజినెస్ మేన్ రీమేక్, క్లారిటీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. మరి హీరో ఎవరు..?
పూరీ డైరక్షన్ లో వచ్చిన సినిమాల్లో దమ్ముంటుంది.. వాటికి సీక్వెల్స్, రీమేక్ లు చేయగలిగే స్టఫ్ ఉంటుంది. అయితే ఫ్యూచర్ లో పూరీ ఏ సినిమాను రీమేక్ చేస్తారు అన్న ప్రశ్న ఎదురయ్యింది. ఆయన తడుముకోకుండాచెప్పారు బిజినెస్ మెన్ అని.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి సినిమాలో బిజినెస్ మెన్, పోకిరి సినిమాలు కూడా ఉన్నాయి. హీరోగా మహేశ్ బాబు .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు కెరీర్ లో మంచి టర్నింగ్ ఇచ్చిన సినిమాలివి. సంచలన విజయాలను సాధించిన ఈ రెండు సినిమాలకి సీక్వెల్స్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ముందు ముందు వస్తుందేమో అని ఆశతో ఉన్నారు అభిమానులు. కాని అది ఇంత వరకూ జరగలేదు.
అయితే పూరీజగన్నాథ్ నుంచి రేపు అగస్ట్ 25న రిలీజ్ కాబోతున్న సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఈసందర్భంగా పూరీ జగన్నాథ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. దేశమంతా పర్యటిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ ప్రమోషన్ ఈవెంట్ లోనే తన సినిమాల గురించి మాట్లాడాడు పూరీ. మీడియా నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
అందులో బాగంగా తన పాత సినిమాల గురించి డిస్కర్షన్ రాగా.. బిజినెస్ మెన్,పోకిరి సినిమాల కథలకు సీక్వెల్ లాగే దమ్ముందనీ .. ఆ రెండు సినిమాల్లోని హీరో పాత్రలంటే తనకి చాలా ఇష్టమని లైగర్ ప్రమోషన్స్ లో పూరి అన్నాడు. అయితే అప్పట్లోనే తానూ సీక్వెల్స్ ప్లాన్ చేసినా మహేశ్ బిజీగా ఉండటం వలన వీలుపడలేదని చెప్పాడు. అన్నీ కలిసొస్తే తెలుగులో ఈ సీక్వెల్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.
ఇక బిజినెస్ మేన్' సినిమా విషయంలో సెన్సెషన్ విషయాన్ని చెప్పారు పూరి. బిజినెస్ మెన్ ను మాత్రం హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందనీ, అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా త్వరలో మొదలుపెడతామని చెప్పాడు. ఈ సినిమా కూడా కరణ్ జోహార్ కాంబినేషన్ లోనే ఉండబోతున్నట్టు తెలిసింది. మరి కరణ్ జొహార్ తో కలిసి పూరి ఏ బాలీవుడ్ హీరోను ఈ సినిమా కోసం సెట్ చేస్తాడో చూడాలి.