మరోసారి టాలీవుడ్లో దుమారం రేపుతున్న ప్రకాష్ రాజ్ ట్వీట్
ప్రకాష్ రాజ్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టారనేదానిపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మ్యాటర్ మాత్రం అందరికి అర్థమైపోయింది. ఆయన `మా` ఎన్నికలను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని కన్ఫమ్ చేసుకుంటున్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో బాంబ్ పేల్చారు. ఒక్క ట్వీట్తో మళ్లీ అగ్గి రాజేశారు. సైలెంట్గా అయిన విషయాన్ని తట్టి లేపారు. అనేక సందేహాలకు తెరలేపారు. మరి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఏంటనేది చూస్తే.. ఆయన `తెగేదాకా లాక్కండి` అని ట్విట్టర్ ద్వారా బుధవారం ఓ పోస్ట్ పెట్టారు. `జస్ట్ ఆస్కింగ్` అని ట్యాగ్ని జోడించాడు. ప్రకాష్ రాజ్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టారనేదానిపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మ్యాటర్ మాత్రం అందరికి అర్థమైపోయింది. ఆయన `మా` ఎన్నికలను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని కన్ఫమ్ చేసుకుంటున్నారు.
అయితే `మా` ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. `మా` అధ్యక్ష బరిలో ఉన్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు. 27మందితో తన ప్యానెల్ని కూడా ప్రకటించారు. ఓ ప్రెస్మీట్ పెట్టి తాను ఏం చేయబోతున్నాడో తెలిపారు. ఆ తర్వాత `మా` ఎన్నికల వేడి మరింతగా పెరిగింది. మంచు విష్ణు తాను మా అధ్యక్ష బరిలో ఉన్నట్టు ప్రకటించారు. ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ, ఏకగ్రీవానికి తాను సిద్ధమే అని, తన సొంత ఖర్చుతో `మా` కోసం బిల్డింగ్ నిర్మిస్తానని తెలిపారు.
మరోవైపు బాలకృష్ణ సైతం దీనిపై స్పందించారు. మంచు విష్ణుకి సపోర్ట్ చేశారు. `మా` బిల్డింగ్ కోసం తాను కూడా సహాయం చేస్తానని తెలిపారు. అదే సమయంలో ఫండ్ రైజింగ్ కోసం చేసిన ఈవెంట్లోని అవకతవకలను బయటపెట్టారు. విదేశాల్లో చేసిన ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బుకి లెక్కలేవి అని ప్రశ్నించారు. దీంతో `మా` ఎన్నికల వేడి మరింతగా పెరిగిపోయి ఆసక్తికరంగా, రసవత్తరంగా మారింది. మరోవైపు ఇటీవల `మా` ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమైంది. ఇందులో ప్రస్తుత బాడీకి చట్టబద్దత ఉందని, ఎన్నికలు జరిగే వరకు గరిష్టంగా ఆరేళ్ల వరకు ఈ బాడీకి అధికారం ఉందని న్యాయ నిపుణులు తేల్చారని ప్రస్తుత `మా` అధ్యక్షుడు నరేష్ తెలిపారు.
అంతకు ముందు ప్రస్తుత కమిటీకి చట్టబద్ధత లేదని, దాని కాలపరిమితి అయిపోయిందని కృష్ణంరాజుకి కొందరు సభ్యులు లెటర్ రాసిన నేపథ్యంలో నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ దుమారం రేపుతుంది. ఆయన పరోక్షంగా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నట్టు అర్థమవుతుంది. `మా` ఎన్నికలను ఉద్దేశించే ప్రకాష్రాజ్ ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. ఇక `మా` అధ్యక్ష బరిలో ప్రకాష్రాజ్, మంచు విష్ణుతోపాటు హేమ, జీవిత, సీవీఎల్ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ ఉండేలా ఉంది. సెప్టెంబర్లో `మా` ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.