Asianet News TeluguAsianet News Telugu

మరోసారి టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌

ప్రకాష్‌ రాజ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్‌ పెట్టారనేదానిపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మ్యాటర్‌ మాత్రం అందరికి అర్థమైపోయింది. ఆయన `మా` ఎన్నికలను ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేశారని కన్ఫమ్‌ చేసుకుంటున్నారు. 

prakash raj tweet hot topic in tollywood
Author
Hyderabad, First Published Aug 5, 2021, 9:21 AM IST

విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరో బాంబ్‌ పేల్చారు. ఒక్క ట్వీట్‌తో మళ్లీ అగ్గి రాజేశారు. సైలెంట్‌గా అయిన విషయాన్ని తట్టి లేపారు. అనేక సందేహాలకు తెరలేపారు. మరి ప్రకాష్‌ రాజ్‌ చేసిన ట్వీట్‌ ఏంటనేది చూస్తే.. ఆయన `తెగేదాకా లాక్కండి` అని ట్విట్టర్‌ ద్వారా బుధవారం ఓ పోస్ట్ పెట్టారు. `జస్ట్ ఆస్కింగ్‌` అని ట్యాగ్‌ని జోడించాడు. ప్రకాష్‌ రాజ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్‌ పెట్టారనేదానిపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మ్యాటర్‌ మాత్రం అందరికి అర్థమైపోయింది. ఆయన `మా` ఎన్నికలను ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేశారని కన్ఫమ్‌ చేసుకుంటున్నారు. 

అయితే `మా` ఎన్నికల కోసం ప్రకాష్‌ రాజ్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. `మా` అధ్యక్ష బరిలో ఉన్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు. 27మందితో తన ప్యానెల్‌ని కూడా ప్రకటించారు. ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి తాను ఏం చేయబోతున్నాడో తెలిపారు. ఆ తర్వాత `మా` ఎన్నికల వేడి మరింతగా పెరిగింది. మంచు విష్ణు తాను మా అధ్యక్ష బరిలో ఉన్నట్టు ప్రకటించారు. ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ, ఏకగ్రీవానికి తాను సిద్ధమే అని, తన సొంత ఖర్చుతో `మా` కోసం బిల్డింగ్‌ నిర్మిస్తానని తెలిపారు. 

మరోవైపు బాలకృష్ణ సైతం దీనిపై స్పందించారు. మంచు విష్ణుకి సపోర్ట్ చేశారు. `మా` బిల్డింగ్‌ కోసం తాను కూడా సహాయం చేస్తానని తెలిపారు. అదే సమయంలో ఫండ్‌ రైజింగ్‌ కోసం చేసిన ఈవెంట్‌లోని అవకతవకలను బయటపెట్టారు. విదేశాల్లో చేసిన ఈవెంట్‌ ద్వారా వచ్చిన డబ్బుకి లెక్కలేవి అని ప్రశ్నించారు. దీంతో `మా` ఎన్నికల వేడి మరింతగా పెరిగిపోయి ఆసక్తికరంగా, రసవత్తరంగా మారింది. మరోవైపు ఇటీవల `మా` ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశమైంది. ఇందులో ప్రస్తుత బాడీకి చట్టబద్దత ఉందని, ఎన్నికలు జరిగే వరకు గరిష్టంగా ఆరేళ్ల వరకు ఈ బాడీకి అధికారం ఉందని న్యాయ నిపుణులు తేల్చారని ప్రస్తుత `మా` అధ్యక్షుడు నరేష్‌ తెలిపారు.

 అంతకు ముందు ప్రస్తుత కమిటీకి చట్టబద్ధత లేదని, దాని కాలపరిమితి అయిపోయిందని కృష్ణంరాజుకి కొందరు సభ్యులు లెటర్‌ రాసిన నేపథ్యంలో నరేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో  ప్రకాష్‌ రాజ్‌ తాజా ట్వీట్‌ దుమారం రేపుతుంది. ఆయన పరోక్షంగా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నట్టు అర్థమవుతుంది. `మా` ఎన్నికలను ఉద్దేశించే ప్రకాష్‌రాజ్‌ ఈ ట్వీట్‌ చేశారని నెటిజన్లు సైతం కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక `మా` అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణుతోపాటు హేమ, జీవిత, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్యే పోటీ ఉండేలా ఉంది. సెప్టెంబర్‌లో `మా` ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios