కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఏకంగా ఇండియా బాక్సాఫీస్ నే కొల్లగొడుతున్న ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’పై ఏకంగా అగ్రశేణి తారలే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్రభాస్, రామ్ చరణ్ కేజీఎఫ్ 2 టీమ్ కు అభినందనలు తెలిపారు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, మోస్ట్ అవెయిటెడ్ చిత్రంగా నిలిచి, బ్లాక్ బాస్టర్ హిట్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కేజీఎఫ్ ఛాప్టర్ 2. ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లను రాబట్టి హ్యయేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా పేరు దక్కించుకుంది. మరోవైపు ఈ చిత్రంలోని సన్నివేశాలు, క్యారెక్టర్ ఎలివేషన్, మాస్ విజువల్స్, బీజీఎంకు ప్రేక్షకుల నుంచే కాకుండా.. అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) రాఖీ బాయ్ గా నటించి ఇండియా మొత్తంగా ఆడియెన్స్ తో శభాష్ అనిపించుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాస్ విజువల్స్ తో తన దర్శక ప్రతిభను చాటిచెప్పాడు. దీంతో స్టార్ హీరోల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే అల్లుఅర్జున్ (Allu Arjun) Kgf Chapter 2పై రెస్పాండ్ అవుతూ యష్, ప్రశాంత్ నీల్ కు స్పెషల్ గా అభినందనలు తెలిపారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ స్పందించారు. ఇన్ స్టా స్టోరీ ద్వారా ప్రభాస్ స్పందిస్తూ .. కన్నడ స్టార్ హీరో యష్ (Yash), దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అభినందనలు తెలిపారు. అలాగే సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ కు కూడా కంగ్రాట్స్ తెలియజేశారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకోవడం పట్ల చిత్ర యూనిట్ ను, సంజయ్ దత్త, రవీనా టండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా కేజీఎఫ్ ఛాప్టర్ 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ పై స్పందించకుండా ఉండలేకపోయారు. ట్విటర్ వేదికన చెర్రీ స్పందిస్తూ.. ‘నా సోదరుడు ప్రశాంత్ నీల్ కు, హుంబాలే ఫిల్స్ కు, కేజీఎఫ్ 2 మూవీ టీమ్ కు అభినందనలు. అలాగే నా ప్రియమైన సోదరుడు రాకీ బాయ్ యష్ పర్ఫార్మెన్స్ మనసుకు హత్తుకునేలా ఉంది. మీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు బాగా నచ్చింది’ అంటూ ట్వీట్ చేశారు. ఇలా కేజీఎఫ్ 2పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు రాకీబాయ్ థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాడు. బాక్సాఫీ వద్ద కలెక్షన్లు రాబడుతూనే ఉన్నారు.
మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ 2 క్రియేట్ చేసిన ప్రభంజనంతో Salaarపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రభాస్ ను ఆన్ స్క్రీన్ పై ప్రశాంత్ నీల్ ఎలా డైరెక్ట్ చేయనున్నారనేది అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొల్పింది. ప్రభాస్ కు జంటగా హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తుండగా, జగపతి బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.