Asianet News TeluguAsianet News Telugu

కీర్తిసురేష్‌ బాటలో పూజాహెగ్డే.. `ఎఫ్‌3`లో ఐటెమ్‌ సాంగ్‌.. అక్కడేమో అన్నాచెల్లెలు..

పూజా హెగ్డే ఓ విషయంలో కీర్తిసురేష్‌ని ఫాలో అవుతుంది. బాలీవుడ్‌ సినిమాలో ఆమె చెల్లిగా నటిస్తుంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

pooja hegde following keerthy suresh she doing as sister with venkatesh
Author
Hyderabad, First Published May 17, 2022, 6:16 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) చూడబోతుంటే.. కీర్తి సురేష్‌(Keerthy Suresh)ని ఫాలో అవుతున్నట్టుంది. ఆమె స్టార్‌ హీరోకి చెల్లిగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పూజా హెగ్డే చెల్లిగా నటించేది విక్టరీ వెంకటేష్‌(Venkatesh)తో కావడం విశేషం. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన `ఎఫ్‌ 3` చిత్రం ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఇందులో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు నటిస్తుండగా, పూజాహెగ్డే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. `లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా ` అంటూ సాగే పార్టీ సాంగ్‌లో పూజా హాట్‌ స్టెప్పులేయగా, ఆమెతో కలిసి వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ మాస్‌ స్టెప్పులేశారు. ఈ పాట లిరికల్‌ వీడియో విడుదలై ఆకట్టుకుంటుంది. 

ఈ నేపథ్యంలో `ఎఫ్‌3`లో ఐటెమ్‌ సాంగ్‌కి స్టెప్పులేసిన Pooja, వెంకటేష్‌.. అక్కడేమో అన్నాచెల్లెలుగా నటిస్తుండటం విశేషం. పూజా హెగ్డే హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. అయితే అందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు చెల్లిగా పూజా హెగ్డే కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇప్పటికే కీర్తిసురేష్‌ `భోళాశంకర్‌` చిత్రంతో చిరంజీవికి చెల్లిగా నటిస్తుండటంతో బాగా చర్చనీయాంశమైంది. కీర్తి రాంగ్‌ స్టెప్‌ తీసుకుంటుందా? అనే విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. మరి కెరీర్‌ పీక్‌లో ఉన్న పూజా చెల్లి పాత్ర చేయడాన్ని అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి. 

అయితే ఇందులో మెయిన్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కావడంతో వెంకీ పాత్ర లెక్కలోకి రాదు. సల్మాన్‌ సినిమాగానే చూస్తారు. పైగా వెంకటేష్‌ కాబట్టి అన్ని రకాల పాత్రలకు ఆయన కంఫర్ట్ గా భావిస్తారు. ఆయనకు చెల్లిగా చేసినా మార్కెట్‌ పై ప్రభావం ఉండదని, ఆ ప్రభావం పూజాపై పడబోదని అంటున్నారు క్రిటిక్స్. ఇక పూజా హెగ్డే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె `రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `ఆచార్య`లో మెరిసింది. ప్రస్తుతం మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ సినిమాలో నటించబోతుంది. ఇది వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు హరీష్‌ శంకర్‌- పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలోనూ పూజా కథానాయికగా కనిపించబోతుంది. 

ఇదిలా ఉంటే పూజా హెగ్డే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్‌ ఆమె కేన్స్ లో సందడి చేయబోతుంది. ఈ సారి కేన్స్ లో పాల్గొనేందుకు ఆమెకి ఆహ్వానం అందింది. దీంతో ఆమె ఇప్పటికే పారిస్‌కి బయలు దేరారు. ఎయిర్‌పోర్ట్ లో ఆమెకి ఘనంగా వీడ్కోలు పలికారు అభిమానులు. 

Follow Us:
Download App:
  • android
  • ios