Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎపిసోడ్ టెలీకాస్ట్ డేట్ ఫిక్స్

ఇప్పుడు మరోసార్ బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు తారక్.. ‘ఆట నాది గెలుపు మీది’ అంటూ కొత్త షో తో రాబోతున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

NTRs EMK to begin on August 15 jsp
Author
Hyderabad, First Published Jul 21, 2021, 4:46 PM IST

సినిమాలతోపాటు టీవీ షో లతోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పటికే స్టార్ మా లో టెలికాస్ట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 కు తారక్ హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్నారు.  తనదైన ఎనర్జీ తో ఎన్టీఆర్ బిగ్ బాస్ ను టాప్ రేటింగ్ షో గా మార్చేశారు. ఇప్పుడు మరోసార్ బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు తారక్.. ‘ఆట నాది గెలుపు మీది’ అంటూ కొత్త షో తో రాబోతున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

RRR సినిమా టాకీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ మొన్నటి నుండి( జులై 10) ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు ఈ షోకు సంబంధించిన షూటింగులో పాల్గొని జులై 20 నుండి తిరిగి ఆర్ఆర్ఆర్ సినిమా పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు తారక్. ఇలా ఓ వైపు సినిమాలతో మరోవైపు టీవీ షో తో ప్రేక్షకులను అలరించడానికి యంగ్ టైగర్ సిద్దం అవుతున్నారు.  ఈ నేఫద్యంలో  ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభం కానుందనే విషయంలో అంతటా ఆసక్తిగా మారింది. 

అందుతున్న సమాచారం ప్రకారం..ఎన్టీఆర్ రీసెంట్ గా కర్టన్ రైజర్ ఎపిసోడ్ ని పూర్తి చేసారు. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఫస్ట్ గెస్ట్ గా రానున్నారు. ఈ ఎపిసోడ్ ఆగస్టు 15న టెలీకాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ క్విజ్ లో పాల్గొంటారు. అందులో వచ్చిన డబ్బుని ఛారిటీకి ఇచ్చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ జనాలను ఈ షో వైపుగా దృష్టి పడేలా చేస్తుందని నమ్ముతున్నారు. జెమినీ వారు ఈ షో డేట్ ని భారీ పబ్లిసిటీతో ఎనౌన్స్ చేయనున్నారు.
 
 మరో ప్రక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే  రీస్టార్ట్ అయ్యి టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తారక్ తోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు ఆర్ఆర్ఆర్ టీం. 

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. తారక్ కోసం అదిరిపోయే కథను సిద్దం చేశాడట కొరటాల. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. దాంతో ఈ రాబోయే కొరటాల- తారక్ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios