Asianet News TeluguAsianet News Telugu

5 గంటలపాటు వెయిట్ చేసి వెనక్కి వెళ్లిపోయిన మహేష్!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్‌ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. భరత్‌ అనే నేను లాంటి భారీ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

No Permission to Maharishi movie at Airport
Author
Hyderabad, First Published Feb 25, 2019, 4:20 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్‌ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. భరత్‌ అనే నేను లాంటి భారీ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ గాను .. బడా సంస్థకి సీఈఓ గాను .. రైతుగాను మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. తాజాగా హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరగనున్న ఈ సినిమా షూటింగుకి అనుకోని అవాంతరం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ నుంచి మహేశ్ బాబు వెళ్లిపోయేలా చేసింది.

నిన్న ఉదయం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షూటింగ్ చేసుకోవడానికి 'మహర్షి' టీమ్ అధికారుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకుంది. అయితే భద్రతా సంబంధమైన కొన్ని సమస్యల కారణంగా, అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. 

హై అలర్ట్ ప్రకటించిన కారణంగా, అధికారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో 5 గంటలపాటు తన క్యారవాన్ లో నిరీక్షించిన మహేశ్ బాబు, ఓపిక నశించడంతో తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios