Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఆదిపురుష్ పై మళ్ళీ మొదలైన ట్రోల్స్, ఆ సినిమాను పోలుస్తూ పరువు తీస్తోన్న నెటిజన్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  ఆది పురుష్ సినిమాపై మళ్ళీ ట్రోలింగ్ మొదలయ్యింది. దారుణంగా పోలుస్తూ.. సినిమా గ్రాఫిక్స్ పై అవహేళన చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.
 

Netizens troll Prabhas Adipurush again
Author
First Published Nov 21, 2022, 7:23 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  ఆది పురుష్ సినిమాపై మళ్ళీ ట్రోలింగ్ మొదలయ్యింది. దారుణంగా పోలుస్తూ.. సినిమా గ్రాఫిక్స్ పై అవహేళన చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ పై మరోసారి ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో  గట్టిగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి.  అంతే కాదు రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ టీజర్ తో పోలుస్తూ.. మరోసారి ప్రభాస్ ఆదిపురుష్ నుఏకిపడేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. తేజ సజ్జా టైటిల్ రోల్‌లో నటించిన హనుమాన్ మూవీ అఫీషియల్  టీజర్ నవంబర్ 21, సోమవారం రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీ టీజర్ లో గ్రాఫిక్స్ , విఎఫ్ ఎక్స్ విషయంలో ప్రజంటేషన్ అద్భుతం అంటూ  సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.  

అయితే ఈ టీజర్ ను ప్రభాస్  ఆదిపురుష టీజర్‌తో పోల్చుతున్నారు. ఈ రెండు టీజర్ల విషయంలో ఏకాభిప్రాయంతో నెటిజన్లు చెప్పేది ఏంటీ అంటే..?  హనుమాన్ టీజర్‌ ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ కంటే కూడా క్వాలిటీ గ్రాఫిక్స్ తో పాటు..క్వాలిటీ  వీఎఫ్ఎక్స్ తో రూపొందించబడుతుంది అని అంటున్నారు జనాలు.చాలా తక్కువ బడ్జెట్ లో హనుమాన్ టీమ్ మంచి క్వాలిటీ చూపించారంటూ ప్రశంసలు అందుతున్నాయి

తేజ సజ్జ ఫస్ట్ టైమ్  పాన్ ఇండియాకు వెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ మూవీ  టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూసిన  నెటిజన్ల  థంబ్స్-అప్ చూపిస్తూ.. ప్రభాస్ అడుపురుష టీజర్ కంటే ఇదే బెటర్ గా ఉందీ అంటూ ప్రసంసిస్తున్నారు.


ఎంతో కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆదిపురుష టీజర్‌ అక్టోబర్‌లో అభిమానుల కోలాహలం మధ్య రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. అంతే కాదు ఈ సినిమాపై దారుణమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా టీజర్ చూసిన జనాలు ఇది ఇంగ్లీష్ మూవీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాపీలా ఉందని.అందులో విఎఫ్ ఎస్ క్వాలిటీవి ఉంటే.. ఇవి చీఫ్ గా ఉన్నాయన్నారు. 

 

ఇక దారుణంగా ట్రోల్స్ రావడంతో 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్న ఆదిపురుష్ రిలీజ్ ను వాయిదా వేశారు. అన్ని పనులు చూసుకుని.. గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని.. వచ్చే ఏడాది జూన్ కాని జులై కాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు టీమ్. 

 

ఇక హనుమాన్ విషయానికి వస్తే, ఇది అంజనాద్రి అనే  గ్రామం  చుట్టు సాగే  సూపర్ హీరో కథతో ఈమూవీ తెరకెక్కుతోంది. తేజ్ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీని  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇక ఈమూవీ టీజర్ తో తేజ్ కు మంచి పేరు వచ్చింది. టీజర్ తోనే ఆడియన్స్ మనసులు దోచాడు తేజ్. ఇక సినిమా సక్సెస్ అయితే.. తేజ్ కెరీర్ కు బ్రేక్ వచ్చినట్టు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈమూవీని రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios