Asianet News TeluguAsianet News Telugu

'నవాబ్' కొత్త ట్రైలర్.. తండ్రి సీటు కోసం కొడుకుల పోరు!

దర్శకుడు మణిరత్నం రూపొందించిన తాజా చిత్రం 'చెక్క చైవంత వానమ్'. తెలుగు లో 'నవాబ్' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. 

nawab movie new trailer
Author
Hyderabad, First Published Sep 22, 2018, 2:23 PM IST

దర్శకుడు మణిరత్నం రూపొందించిన తాజా చిత్రం 'చెక్క చైవంత వానమ్'. తెలుగు లో 'నవాబ్' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.

మణిరత్నం మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిరత్నం సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా చిత్రబృందం మరో ట్రైలర్ ని విడుదల చేసింది.

దీన్ని బట్టి తండ్రి సీటులో కూర్చోడానికి ముగ్గురు కొడుకుల మధ్య జరిగే పోరుతో ఈ సినిమాను తెరకెక్కించినట్లున్నారు. ''నేను మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆడుతున్నాను.. కానీ తిరిగి తిరిగి నా మైండ్‌లో ఒక్కటే డౌట్ రన్నవుతోంది. పెద్దాయన పోయాడంటే ఎవరికి లాభం'' అంటూ శింబు చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్‌ మొత్తం యాక్షన్ తో నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పాట కూడా ఆకట్టుకుంటోంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios