కృష్ణ అంత్యక్రియలకు దూరంగా నాగార్జున.. కారణం అదేనా?.. అలా క్లారిటీ ఇచ్చారా?
సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో యావత్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా పాల్గొన్నారు. కానీ నాగార్జున రాలేదు. కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
సూపర్ స్టార్ కృష్ణ గత వారం రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణంతో యావత్ తెలుగు పరిశ్రమనే కాదు, ఇండియన్సినిమా ప్రముఖులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. ఇరు రాష్ట్రాల సీఎంలు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అఖిల్, మోహన్బాబు, ఆల్మోస్ట్ అందరు హీరోలు పాల్గొన్నారు.
అలాగే త్రివిక్రమ్, కొరటాల శివ, మెహర్ రమేష్ వంటి దర్శకులు, ఇతర నటీనటులు పాల్గొని కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. కానీ వీరిలో నాగార్జున మిస్ అయ్యారు. ఆయన కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించకపోవడం, నివాళ్లు అర్పించకపోవడం చర్చనీయాంశమైంది. ఏం జరిగింది? ఏదైనా గొడవలా అంటూ చర్చ మొదలైంది. నాగ్ రాకపోవడానికి కారణం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
నాగార్జున, కృష్ణ కలిసి `వారసుడు` చిత్రంలో నటించారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఆయనంటే నాగ్కి చాలా ఇష్టం. కానీ కృష్ణ హఠాన్మరణంతో నాగ్ కుంగిపోయారట. ఆయన్ని నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక అంత్యక్రియలకు హాజరు కాలేదట. తాజాగా ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్టు తెలిపారు. నాగ్ కూడా ఆ కారణంతోనే కృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేకపోవచ్చు అని తెలిపారు.
ఇదిలా ఉంటే కృష్ణకి నివాళ్లు అర్పించారు నాగ్. బిగ్ బాస్ 6 తెలుగు షోలో ఆయనకు ప్రత్యేకంగా నివాళ్లు అర్పించారు. వీకెండ్లో మొదట బిగ్ బాస్ స్క్రీన్పై కృష్ణ ఫోటోని ఉంచి మౌనం వహించారు. ఆయన గొప్పతానాన్ని తెలిపారు. ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ కృష్ణ అని, సౌత్, నార్త్ యాక్టర్స్ తో కలిసి సినిమా తీసిన ఘనత ఆయనదే అని తెలిపారు. ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారని తన సంతాపాన్ని ప్రకటించారు నాగార్జున. దీంతో ఓ రకంగా ఈ పుకార్లకి చెక్ పెట్టేశారు నాగ్.