నాగ్ 'పాన్-ఇండియన్ ఫిల్మ్' ఫిక్స్ , వెరైటీ టైటిల్
నాగ్ తో స్టూడియో గ్రీన్ వారు ఈ భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
నిర్మాతగా, నటుడిగా, అక్కినేని నాగార్జున ఎప్పుడూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కొత్త దర్శకులతో పనిచేయడమే కాకుండా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎందరో టెక్నీషియన్స్ ని కూడా పరిచయం చేశాడు. తాజాగా ఆయన అనీల్ మరో యంగ్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆ డైరక్టర్ ఇప్పుడు నాగ్ తో ఓ ప్యాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేసారు. అలాగే ఈ కొత్త చిత్రానికి విభిన్నమైన టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. దర్శకుడి పేరును సీక్రెట్ గా ఉంచినప్పటికీ, దర్శకుడిని నాగార్జున లాక్ చేశారని, అతి త్వరలో ప్రకటిస్తారని తెలిసింది.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ రాజా స్టూడియోగ్రీన్ అనే బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి Love Action Romance (LAR) అనే ఫిక్స్ చేసారని సమాచారం. ఈ సినిమా సీరియస్ లవ్ స్టోరీ తో పాటు యాక్షన్, రొమాన్స్ మిక్స్ అయ్యి ఉంటుందని, వింటేజ్ నాగ్ ని ఈ సినిమాలో చూపిస్తారని అంటున్నారు. ఇక స్టూడియో గ్రీన్ వారు తెలుగులోకి లాంచ్ అవుతూ చేస్తున్న చిత్రం ఇది. ఈ బ్యానర్ లో ఇప్పటికే తమిళంలో చాలా సినిమాలు నిర్మించడం, కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు.
2006లో "సిలును ఒరు కాదల్ (తెలుగులో, నువ్వు నేను ప్రేమ)" సినిమా తో మొదలైన స్టూడియోగ్రీన్ ప్రయాణం లో ఇప్పటికే పరుత్తివీరన్, సింగం, మద్రాస్, సిరుతై వంటి సూపర్ హిట్ సినిమాలను మనకు అందించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "నోటా" సినిమాను కూడా నిర్మించింది. తాజాగా ఇప్పుడు నాగ్ తో స్టూడియో గ్రీన్ వారు ఈ భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
మరో ప్రక్క సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకుని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది నాగ్ తాజా చిత్రం నా సామి రంగా . ప్రస్తుతం హైదరాబాద్ లోనే కీలక షెడ్యూల్స్ జరుపుతున్నారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామాలో మెయిన్ హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ నటిస్తోంది. మళయాలం మూవీ పోరంజు మరియం జోస్ రీమేక్ ఇది. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.