సక్సెస్ కోసం కసితో ఉన్న నాగశౌర్య, వర్షం కూడా లెక్కచేయకుండా ప్రమోషన్ లో యంగ్ హీరో
వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
వరుసగా ప్లాప్ లు పడినా తగ్గేది లేదు అంటున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. వరుసగా సినిమాలు నిరాశరుస్తుండటంతో.. మధ్య కొన్ని ప్రయోగాలు కూడా చేసి ప్రయత్నం చేశాడు. కాని అవి కూడా కలిసి రాలేదు నాగశౌర్యకు. అందుకే ఇక హిట్లు, ఫ్లాప్లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తనకు వరుసగా ప్లాప్ లు ఇస్తున్నా.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య. కెరీర్ బిగినింగ్ నుంచి కూడా నాగశౌర్య చాలా తెలివిగానే ఆలోచిస్తున్నాడు. కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కాని అతన్ని సక్సెస్ మాత్రం వరించడంలేదు. అయినా నిరాశచెందకుండా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో.
వరుడు కావలెను, లక్ష్య లాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. డిఫరెంట్ టైటిల్ తో కృష్ణ వ్రింద విహారి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగశౌర్య. అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈసినిమా చాలాసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కు ముహూర్తం కుదిరింది. రీసెంట్ గా ఈమూవీ రిలీజ్ డేట్ నుప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు మేకర్స్. సినిమా నుంచి వరుసగా అప్ డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మేకర్స్ సినిమా ప్రమోషన్స్ను కూడా స్టార్ట్ చేశారు.
ఈ ప్రమోషన్స్ పై నాగశౌర్య ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ప్రమోషన్స్ను కాస్త కొత్తగా చేయాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ చేయని విధంగా.. ప్రమోషన్స్ లో భాగంగా పాద యాత్రతో చేస్తున్నారు మూవీ టీమ్. ఈ పాదయాత్రకు రీజన్ కూడా చెపుతున్నారు టీమ్. కరోనా వల్ల సినిమాలకు ప్రేక్షకులకు దూరంగా పెరింగింది. ఆ దూరాన్ని తగ్గించి.. ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకే పాదయాత్రతో ప్రమోషన్స్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఇక ఈపాదయాత్రలో నాగశౌర్య ఫుల్ జోష్ తో పాల్గోంటున్నారు. ఎంతలా అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ... నాగశౌర్య వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు జన్లు సింప్లీసిటీ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని నాగశౌర్య హోం బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. నాగశౌర్యకు జోడీగా షిర్లే సేథియా హీరోయిన్గా నటించింది. స్వర మాంత్రికుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.