ఫస్ట్ టైమ్ పెద్ద సాహసం చేయబోతున్న మహేష్బాబు.. అది సాధ్యమేనా?
త్రివిక్రమ్ సినిమా కోసం ప్రీపేర్ అవుతున్నారు. వచ్చే నెలలో షూటింగ్ని ప్రారంభించబోతున్నారు. జనవరి రెండో వారం నుంచి ఎస్ఎస్ఎంబీ28 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట మహేష్.
సూపర్ స్టార్ మహేష్ మొదటి సారి సాహసం చేయబోతున్నారు. కెరీర్లోనే ఇప్పటి వరకు చేయనటువంటి సాహసం చేయబోతున్నారు. చాలా రిస్క్ తీసుకోబోతున్నారు. ఆ రిస్క్ త్రివిక్రమ్ సినిమా కోసం తీసుకోబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ విశేషాలు చూస్తే, మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. మళ్లీ రెండో షెడ్యూల్ ప్రారంభించాలనుకున్న సమయంలోనే మహేష్ మదర్ ఇందిరాదేవి మరణించారు. ఆ బాధ నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్కి రెడీ అయిన వెంటనే ఈ సారి సూపర్స్టార్ కృష్ణ హఠాన్మరణం చెందారు. బ్యాక్ టూ బ్యాక్ పేరెంట్స్ ని కోల్పోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కోలుకోలేని దెబ్బ పడినట్టయ్యింది. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు మహేష్.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా కోసం ప్రీపేర్ అవుతున్నారు. వచ్చే నెలలో షూటింగ్ని ప్రారంభించబోతున్నారు. జనవరి రెండో వారం నుంచి ఎస్ఎస్ఎంబీ28 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట మహేష్. నిజానికి డిసెంబర్ 15 నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో దాన్ని నెల రోజులపాటు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ని భారీగా ప్లాన్ చేశారట త్రివిక్రమ్. లాంగెస్ట్ షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తున్నారట.
ఏకంగా అరవై రోజులకుపైగానే ఈషెడ్యూల్ని ప్లాన్ చేశారట. అంటే కంటిన్యూగా రెండు నెలలపాటు మహేష్ షూటింగ్లోనే ఉండబోతున్నారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా చిత్రీకరించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే షూటింగ్లు పలు మార్లు వాయిదా పడినా నేపథ్యంలో చాలా డేట్స్ వేస్ట్ అయ్యాయి. ఆ లోటుని భర్తీ చేసేందుకు త్రివిక్రమ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అయితే ఇది మహేష్ కెరీర్లోనే ఇప్పటి వరకు చేయనటువంటి లాంగెస్ట్ షెడ్యూల్ అని, ఓ రకంగా మహేష్ పెద్ద సాహసమే చేయబోతున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా, అది సాధ్యమేనా అనేది చూడాలి.
ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఈ లేటెస్ట్ అప్డేట్తో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ డిలే కావడంతో నెక్ట్స్ దసరా దీపావళికి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో మరో హీరోయిన్ శ్రీలీలా కూడా నటిస్తుందని తెలుస్తుంది. అలాగే రష్మికతో ఐటెమ్ సాంగ్ ప్లాన్ కూడా ఉందట. త్రివిక్రమ్ సినిమాల్లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నారట నిర్మాతలు.