చిరంజీవికి నిర్మొహమాటంగా నో చెప్పిన సాయిపల్లవి.. మహేష్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
ఇటీవల `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్`లోనూ ఆమె అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్ చేసింది. ఆడియెన్స్ ని మరోసారి ఫిదా చేసింది. ఇదిలా ఉంటే సాయిపల్లవి ఇప్పుడు మహేష్ సినిమాలో నటించబోతుందనే టాక్ వినిపిస్తుంది.
సాయిపల్లవి(Sai Pallavi).. అంటే వెండితెరపై ఓ నృత్య తరంగం. ఆమె వేసే స్టెప్పులకు ఆడియెన్స్ పిచ్చెక్కిపోతారు. మైండ్ బ్లాక్ చేసేలా సాయిపల్లవి డాన్సులుంటాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్`లోనూ ఆమె అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్ చేసింది. ఆడియెన్స్ ని మరోసారి ఫిదా చేసింది. ఇదిలా ఉంటే సాయిపల్లవి ఇప్పుడు మహేష్ సినిమాలో నటించబోతుందనే టాక్ వినిపిస్తుంది. మహేష్బాబు(Maheshbabu), త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఇందులో ఇప్పటికే పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఆమెతోపాటు మరో హీరోయిన్కి కూడా స్కోప్ ఉందట. అయితే చెల్లి పాత్రకి కూడా ప్రయారిటీ ఉంటుందని తెలుస్తుంది. సిస్టర్ సెంటిమెంట్తో సినిమా కథ సాగుతుందని, అందుకు సిస్టర్ రోల్ కోసం సాయిపల్లవిని అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. మరి అందుకు సాయిపల్లవి ఓకే చెబుతుందా? లేదా అనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi) సినిమాలో Sai Pallaviకి ఆఫర్ వచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న `భోళాశంకర్` చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్రకి సాయిపల్లవిని అడగ్గా అందుకు ఆమె నో చెప్పింది. తాను రీమేక్ సినిమాలో చేయడం ఇష్టం లేక నటించలేదని, అంతేతప్ప మరో కారణం కాదని `లవ్స్టోరి` ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయిపల్లవి వివరణ ఇచ్చింది. అయితే ఇప్పుడు చిరంజీవికి నో చెప్పి మహేష్కి ఎస్ చెబుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
అభిమానుల నుంచి మాత్రం ఆమె చెల్లిగా చేయోద్దనే కామెంట్ వినిపిస్తుంది. చెల్లి పాత్రలు చేస్తే కెరీర్ ప్రమాదంలో పడుతుందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి సిస్టర్స్ రోల్స్ చేస్తే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తుంటాయి. దీంతో ఇక వారిని హీరోయిన్గా చూడటం కష్టం. దీంతో సిస్టర్ రోల్స్ చేయోద్దంటున్నారు. ఛాన్స్ వస్తే హీరోయిన్గా చేస్తే తాము హ్యాపీ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సాయిపల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇటీవల `లవ్స్టోరి` చిత్రంతో, అలాగే `శ్యామ్సింగరాయ్` చిత్రాలతో వరుస సక్సెస్లు అందుకున్న సాయిపల్లవి, ప్రస్తుతం `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. రానా సరసన అభ్యూదయ భావాలు కలిగిన అమ్మాయిగా కనిపించబోతుంది. దీనికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.