Asianet News TeluguAsianet News Telugu

వెంటనే అరెస్ట్ చేయండి..శరత్ కుమార్ - రాధారవిలకు షాకిచ్చిన హై కోర్ట్

ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, రాధారవికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ ఉత్తర్వులు జారీచేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ కోలీవుడ్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

madras high court about sharath land issue
Author
Hyderabad, First Published May 5, 2019, 2:03 PM IST

ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, రాధారవికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ ఉత్తర్వులు జారీచేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ కోలీవుడ్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. 2017 కి ముందు తమిళ నటీనటుల సంఘానికి శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాధారవి కార్యదర్శిగా కొనసాగారు. అయితే ఆ సమయంలో నడిగర్‌ సంఘానికి చెందిన ఒక స్థలాన్ని ఎవరికీ తెలియకుండా అక్రమంగా అమ్మసినట్లు 2017లో ఓ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు. 

కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న స్థలాన్ని అమ్మేసినట్లు అప్పట్లో శరత్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయంపై వేసిన పిటిషన్ ను కోర్టు శనివారం విచారణ జరిపించింది. మూడు నెలల్లో కేసును తేల్చాలని వెంటనే శరత్ - రాధారవిలను అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios