సూపర్ స్టార్ కృష్ణ మృతికి లోక్సభ సంతాపం..
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన ములాయం సింగ్ యాదవ్ (సిట్టింగ్ ఎంపీ), మాజీ సభ్యులకు సంతాపం తెలిపింది.
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణకు పార్లమెంట్ నివాళి అర్పించింది. పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన ములాయం సింగ్ యాదవ్ (సిట్టింగ్ ఎంపీ), మాజీ సభ్యులకు సంతాపం తెలిపింది. ఈ క్రమంలోనే గత నెలలో తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణకు లోక్సభ సర్మించుకుంది. స్పీకర్ ఓం బిర్లా సంతాప సందేశం చదువుతూ.. ఏలూరు నుంచి లోక్సభకు ఎన్నికైన కృష్ణ.. తొమ్మిదోవ లోక్సభలో సభ్యునిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయన సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందారని అన్నారు.
5 దశాబ్దాల కాలంలో 300కు పైగా సినిమాల్లో నటించారని చెప్పారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కంట్రిబ్యూషన్కు గానూ 2009లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించిందని అన్నారు. ఆయన నవంబర్ 15న హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్తో పాటు 8 మంది మాజీ సభ్యుల మృతిపై సభ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. దివంగత నేతలకు సంతాప సూచకంగా లోక్సభలో కొంతసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఆ సమయంలో లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, సుదీప్ బందోపాధ్యాయ, ఫరూక్ అబ్దుల్లా, తదితర ఎంపీలు ఉన్నారు.
ఇక, సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో కాంటినెంటల్ ఆస్పత్రి ఆస్పత్రిలో చేరిన కృష్ణా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ 15వ తేదీ తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే కృష్ణ మృతిపట్ల దేశ ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. నవంబర్ 16వ తేదీన కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.