మహేష్ ప్లేస్ లోకి లావణ్య త్రిపాఠి
నిఖిల్ తో చేసిన ‘అర్జున్ సురవరం’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘ఏ1 ఎక్స్ప్రెస్’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో నటించింది. అయితే ఆమె ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక వెనకబడింది.
అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. . ఆ తర్వాత.. ఆమె అనేక సినిమాల్లో నటించినా నాని మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి అక్కడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది.
నిఖిల్ తో చేసిన ‘అర్జున్ సురవరం’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘ఏ1 ఎక్స్ప్రెస్’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో నటించింది. అయితే ఆమె ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక వెనకబడింది. కానీ ఆమె వెనక ఇప్పుడు బ్రాండ్స్ పడుతున్నాయి. దాంతో ఆమె ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
మహేష్ బాబు ఇంతకాలం గోల్డ్ విన్నర్ ఆయిల్ సౌత్ ఇండియా మార్కెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి లావణ్య త్రిపాఠి వచ్చి చేరింది. ప్రస్తుతం ఆమెపై చెన్నైలో యాడ్ షూట్ జరుగుతోంది. సూపర్ స్టార్ నటించిన యాడ్ లోకి ఆమె రావటం ఇప్పుడు అంతటా సెన్సేషన్ గా మారింది. ఈ నేపధ్యంలో ఆమె కెరీర్ కు మంచి కిక్ వస్తుందని అంటున్నారు. మరిన్ని బ్రాండ్స్ కూడా ఆమెను వరించే అవకాసం ఉంది.
యూపీలోని అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి...ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా...తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చెందారు. ముంబైలోని రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసింది లావణ్య. చదువు పూర్తయ్యాక మోడలింగ్, టీవీ కార్యక్రమాల్లో ప్రవేశించి...ఆ తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది.