Asianet News TeluguAsianet News Telugu

`ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి మరో అప్‌డేట్‌.. సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి మరో అప్‌డేట్‌వ చ్చింది. ఈ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతూనే ఉందట. తాజాగా సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ విశాల్‌ మిశ్రా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సైలెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని చెప్పకనే చెప్పారు.

latest update from ntr ramcharan starrer RRR arj
Author
Hyderabad, First Published Apr 12, 2021, 2:47 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్‌కి కారోనా సోకడంతో సినిమా షూటింగ్‌ని నిలిపివేశారనే ప్రచారం జరిగింది. కానీ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతూనే ఉందట. తాజాగా సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ విశాల్‌ మిశ్రా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సైలెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని చెప్పకనే చెప్పారు.

'ఈ రోజు స్టూడియోలో ఒక మేజిక్ జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ కమ్మింగ్‌ సూన్‌' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ లెక్కన  'ఆర్ఆర్ఆర్' రీ రికార్డింగ్ జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలోనే 'ఆర్ఆర్ఆర్' మీ ముందుకు రాబోతుంది అంటూ రాజమౌళి, కీరవాణి కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం విశేషం. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. బాహుబలి రెండు భాగాల తరవాత జక్కన్న నుంచి రాబోతున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై  ముందునుంచి భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈసినిమా కథపై ఓ కొత్త వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నేటి కాలంతోపాటు గత జన్మలో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజులా పోరాడుతారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడానికి ముందు అల్లూరి సీతారామరాజు, నిజాంతో పోరాడటానికి ముందు కొమురం భీమ్‌ యంగ్‌ ఏజ్‌లో ఏం చేశారనేది ఇందులో చూపించబోతున్నట్టు రాజమౌళి చెప్పారు. 

రామ్‌చరణ్‌ సరసన అలియా భట్‌, ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13న దసరా కానుకగా పదికిపైగా భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios