Asianet News TeluguAsianet News Telugu

కార్తీ సినిమాకు వరదల దెబ్బ.. రూ.1.5కోట్ల నష్టం!

ప్రస్తుతం కార్తీ దేవ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతనికి కెరీర్ లో ఇది 17వ సినిమా. అయితే ఇటీవల షూటింగ్ నిమిత్తం కులుమనాలికి వెళ్లింది. అయితే అక్కడ వాతావరణాన్ని ముందే గ్రహించని చిత్ర యూనిట్ చేదు అనుభవం ఎదురైంది. 140 మంది వరదల ధాటికి ఒక ప్రాంతంలో చిక్కుకున్నారు. 

Karthi dev team stuck in heavy rains
Author
Hyderabad, First Published Sep 24, 2018, 3:07 PM IST

కోలీవుడ్ హీరో కార్తీ సౌత్ ఎలాంటి స్టార్ డమ్ తెచ్చుకున్నాడో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో అన్న సూర్య తరహాలో తనకంటూ ఒక మంచి మార్కెట్ సెట్ చేసుకున్నాడు. ఇకపోతే ఎప్పుడు లేని విధంగా కార్తీ సినిమాకు ఊహించని దెబ్బ పడింది. సినిమా ఇంకా సగం కూడా పూర్తవ్వలేదు అప్పుడే చిత్ర నిర్మాత కోటి రూపాయలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది. అదే విధంగా కార్తీ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.

ప్రస్తుతం కార్తీ దేవ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతనికి కెరీర్ లో ఇది 17వ సినిమా. అయితే ఇటీవల షూటింగ్ నిమిత్తం కులుమనాలికి వెళ్లింది. అయితే అక్కడ వాతావరణాన్ని ముందే గ్రహించని చిత్ర యూనిట్ చేదు అనుభవం ఎదురైంది. 140 మంది వరదల ధాటికి ఒక ప్రాంతంలో చిక్కుకున్నారు. దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంతా సిద్ధం చేసుకొని ఉన్న చిత్ర యూనిట్ వరదల కారణంగా 1.5 కోట్ల రూపాయల వరకు నష్టం చూసినట్లు తెలుస్తోంది. 

ఇక కార్తీ కూడా ఒక ప్రాంతంలో నాలుగైదు గంటలు కారులోనే ఉండిపోవాల్సి వచ్చిందట. వాతావరణం కొంచెం అనుకూలించిన తరువాత కార్తీ సమీపాన ఉన్న ఒక గ్రామానికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.  ప్రిన్స్ పిక్చర్స్ పతాకం ఫై లక్ష్మణ్. 50 కోట్లతో నిర్మిస్తోన్న ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖాకి సినిమా అనంతరం రకుల్ ప్రీత్ మరోసారి కార్తితో ఈ సినిమాలో నటిస్తోంది.   

 

 

Follow Us:
Download App:
  • android
  • ios