బాలయ్యని చూస్తుంటే బాధగా ఉంది.. కంగనా కామెంట్స్!
దర్శకుడు క్రిష్, నటి కంగనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన పూర్తి క్రెడిట్ క్రిష్ కి ఇవ్వకపోవడమే దీనికి కారణం. దీంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొని దూషించుకున్నారు.
దర్శకుడు క్రిష్, నటి కంగనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన పూర్తి క్రెడిట్ క్రిష్ కి ఇవ్వకపోవడమే దీనికి కారణం. దీంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొని దూషించుకున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఇటీవల క్రిష్ తెరకెక్కించిన 'కథానాయకుడు','మహానాయకుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కంగనా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆమె క్రిష్ ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం ఇప్పుడు వార్తలలో నిలిచింది.
ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్ల గురించి విన్నానని, జీరో రికవరీగా నిలిచాయని అన్నారు. బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా మచ్చగా మిగులుతుందని, క్రిష్ ని నమ్మినందుకు బాలయ్యని చూస్తుంటే బాధగా ఉందని విమర్శలు చేసింది కంగనా. క్రిష్ కి ద్రోహం చేశానని విమర్శలు చేసిన వారు ఇప్పుడేమంటారు..? అంటూ ప్రశ్నించింది.
'మణికర్ణిక' సినిమా సక్సెస్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిందని, అటువంటి సినిమాపై విమర్శలు చేస్తారా..? అంటూ మండిపడింది.