కాజల్ `ఎస్` చెప్పింది..ప్రియుడు అతనే.. మ్యారేజ్ ఎప్పుడంటే?
గత కొంత కాలంగా కాజల్ ఓ ముంబయికి చెందిన బిజినెస్ మ్యాన్తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్ చేసింది.
కాజల్ `ఎస్` చెప్పింది.. తనపై వస్తోన్న రూమర్లకి `ఎస్` చెప్పింది. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు `ఎస్` చెప్పింది. తన ప్రియుడికి `ఎస్` చెప్పింది. ఫైనల్గా మ్యారేజ్కి `ఎస్` చెప్పింది. అవును కాజల్ `ఎస్` చెప్పింది.
గత కొంత కాలంగా కాజల్ ఓ ముంబయికి చెందిన బిజినెస్ మ్యాన్తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్ చేసింది. ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ అధినేత గౌతమ్ కిచ్లుని ప్రేమిస్తున్నట్టు, ఆయన్ని పెళ్ళి చేసుకోబోతున్నట్టు పేర్కొంది.
ఈ నెల 30న మ్యారేజ్ వేడుక జరగబోతుందని సడెన్గా చెప్పేసి ఆడియెన్స్ కి, తన అభిమానులకే కాదు, సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది. కాజల్ తాజాగా మంగళవారం ఓ ప్రకటనని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంది.
ఇందులో `ఎస్`.. ఈ వార్తని పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నానని చెబుతూ, గౌతమ్ కిచ్లుతో మ్యారేజ్ ఈ నెల 30న ముంబయిలో జరగబోతుందని, అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సెలబ్రిటీల మధ్య చిన్నగా, ప్రైవేట్గా తమ మ్యారేజ్ జరగబోతున్నట్టు పేర్కొంది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పింది.
గౌతమ్ తో తాను చాలా హ్యాపీగా ఉంటుందట, ఆయనతో జీవితాన్ని పంచుకోవడానికి థ్రిల్గా ఉందట. ఇన్నాళ్ళు తనపై ప్రేమని, అభిమానాన్ని పంచిన ఆడియెన్స్, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. మున్ముందు కూడా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందట. సో ఈ లెక్కన పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ సినిమాలు చేస్తుందని చెప్పకనే చెప్పేసింది.
కాజల్ పంచుకున్న ఈ లేఖతో ఆమె అభిమానులు తెగ బాధపడుతున్నారు. `ఉన్నట్టుండి ఇలా మధ్యలో వదిలేసిపోతే ఎలా..` అంటూ, `మమ్మల్ని ఒంటరి చేశావా..`, `మా ఆశలపై నీళ్ళు చల్లావా` అంటూ ఎమోషనల్ అవుతున్నారు. బాధతాప్త హృదయాలతో విశెష్ చెబుతున్నారు. ఎక్కడ ఉన్న సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు.