క్రిష్... కరోనా పోటు లేకుండా షూటింగ్ అక్కడ ప్లాన్
చిరంజీవి మేనల్లుడు, హీరో సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ తొలిచిత్రం 'ఉప్పెన'. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే మరో సినిమాలో నటించడానికి అతనికి అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా రకుల్ ని ఎంచుకున్నారు.
నిన్నటివరకు స్టార్ హీరోల సరసన పలు చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. చిరంజీవి మేనల్లుడు, హీరో సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ తొలిచిత్రం 'ఉప్పెన'. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే మరో సినిమాలో నటించడానికి అతనికి అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా రకుల్ ని ఎంచుకున్నారు.
‘‘అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. అడవిలో అయితే ఈ కరోనా తలనొప్పి ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క, పవన్ కల్యాణ్ తో తాను చేస్తున్న భారీ చిత్రానికి బ్రేక్ రావడంతో, ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో ఓ చిన్న సినిమా చేయాలని క్రిష్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించి, సింగిల్ షెడ్యూల్ లో దీనిని పూర్తిచేయాలని క్రిష్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నిర్మాణ కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు.