ఇంకో వివాదం...ఐశ్వర్య రాయ్ని రేప్ చేసేవాడ్ని!.. పాత వీడియో వైరల్
ఒక ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ మీద వెకిలిగా మాట్లాడిన విషయం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వేళ తనకు హిందీ వచ్చి ఉంటే..
![If I Known Hindi, Id Have Had Opportunity To Rape Aishwarya Rai Radha Ravi jsp If I Known Hindi, Id Have Had Opportunity To Rape Aishwarya Rai Radha Ravi jsp](https://static-ai.asianetnews.com/images/01hftqbtrj6fbd8s3tm8y5n23x/ishg-jpg_363x203xt.jpg)
త్రిష విషయంలో మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ అంతటా సెన్సేషన్ అయ్యిన సంగతి తెలిసిందే. దాంతో గతంలో ఎవరెవరు ఇలాంటి చేసిన కామెంట్స్ బయిటకు తీస్తున్నారు. పెద్ద తేనె తుట్టెను కదిపాడు మన్సూర్ అలీఖాన్ అన్నట్లు అయ్యింది. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించానని, అయితే తనని రేప్ చేసే సీన్ లేదని బాధ పడ్డానని, త్రిషని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాలనుకొన్నానని ఇలా.. చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు ఓ ఇంటర్వ్యూలో. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకొన్న త్రిష మన్సూర్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక్కడితో అయ్యింది అనుకుంటే ఇప్పుడు గతంలో రాధారవి చేసిన కామెంట్స్ కొన్ని బయిటకు తీసింది సింగర్ చిన్మయి.
ప్రముఖ నటుడు రాధా రవి గతంలో మాట్లాడిన మాటలను తెరపైకి తీసుకొచ్చింది ఆమె. రాధా రవి ఒక ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ మీద వెకిలిగా మాట్లాడిన విషయం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వేళ తనకు హిందీ వచ్చి ఉంటే.. ఐశ్వర్యా రాయ్ని రేప్ చేసి ఉండేవాడ్ని.. అక్కడి వాళ్లు నాకు మంచి పాత్రలు ఎలాగూ ఇచ్చేవారు కదా?.. అలాంటి రేప్ చేసే పాత్రలే వచ్చేవి అన్నట్టుగా రాధా రవి అన్నాడు.
ఆ రోజున ఆయన స్టేజిపై మాట్లాడిన మాటలను జోక్ గా తీసుకుని అక్కడి వారంతా నవ్వేశారు. ఇప్పుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల మీద అందరూ ఫైర్ అవుతున్నారు. వెంటనే మన్సూర్ మీద చర్యలు కూడా తీసుకునేందుకు రెడీ అయ్యారు.కానీ రాధా రవి మీద మాత్రం ఎవ్వరూ ఎలాంటి రియాక్షన్లు చూపించడం లేదు ఎందుకు? నాకు అర్థం కావడం లేదు అంటూ చిన్మయి ప్రశ్నించింది.ఇలాంటి వ్యక్తులు మానవవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే జాతీయ మహిళా కమీషన్ సైతం రంగంలోకి దిగి.. మన్సూర్ పై చర్యలు తీసుకోవాలని డీపీజీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మన్సూర్ పై పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. మన్సూర్పై తమిళ చిత్రసీమ కూడా సీరియస్ అయ్యింది. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే నిషేధాన్ని విధించాల్సివస్తుందని హెచ్చరించింది.