వెళ్లి పడుకో: బిజెపి ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి హీరో సిద్ధార్థ్ స్ట్రాంగ్ కౌంటర్
తాజాగా ఏపీ బీజేపీ కార్యదర్శికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలో ఘాటుగా స్పందించారు.
హీరో సిద్ధార్థ్ సామాజిక అంశాలపై, దేశంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు, మత విద్వేషాలపై స్పందిస్తూ తన గళం విప్పుతున్నారు. ఇటీవల కొందరు బీజేపీ కార్యకర్తలు తనని అత్యాచారం చేసి, హత్య చేస్తామని బెదిరించాని, వరుసగా ఐదువందల కాల్స్ వచ్చాయని సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ బీజేపీ కార్యదర్శికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలో ఘాటుగా స్పందించారు.
`సిద్ధార్థ్ నటించే సినిమాలకు దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వస్తున్నాయా? సమాధానం చెప్పండి` అని ట్వీట్ చేశాడు ఏపీ బీజేపీ కార్యదర్శి ఎస్ విష్ణు వర్థన్రెడ్డి. ఇందులో సిద్ధార్థ్ పేరుని ట్యాగ్ చేశాడు. దీనికి సిద్ధార్థ్ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. `నో రా.. ఆయన నా ట్యాక్స్ కూడా పే చేసేందుకు సిద్ధంగా లేదు. నేను కరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తా కదరా విష్ణు. వెల్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రెటరీ అంట. సిగ్గుండాలి` అంటూ తనదైన స్టయిల్లో రెచ్చిపోయాడు. దీనికి ఆయన అభిమానులు మద్దతు పలుకుతున్నారు. దీనిపై ఆ సదరు లీడర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
'బొమ్మరిల్లు` చిత్రంతో తెలుగు పాపులర్ అయిన సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో `మహాసముద్రం` చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో `టక్కర్`, `ఇండియన్ 2`, `నవరస` చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.