ఆగిపోయిన రవితేజ బ్లాక్ బస్టర్ కాంబో మూవీ?.. కారణం మాత్రం విచిత్రం..
మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఈగల్`తో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఓ క్రేజీ కాంబినేషన్లో మూవీ ఆగిపోయిందట.
మాస్ మహారాజా రవితేజకి మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాప్ పడింది. ఆయన నటించిన `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు`, `ఈగల్` సినిమాలు బోల్తా కొట్టాయి. `ఈగల్` సేఫ్ జోన్లోకి వెళ్తుందని భావించినా దగ్గరలోకి వచ్చి డీలా పడింది. దీంతో ఫెయిల్యూర్ జాబితాలోకి వెళ్లింది. ఇది ఆయనకు హ్యాట్రిక్ ఫ్లాప్గా మారింది. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు మరో సినిమాపై పడింది. మాస్ కాంబో లో రాబోయే సినిమా క్యాన్సిల్ అయ్యింది.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్గా నిలిచింది. వీరిద్దరు కలిసి చేసిన `డాన్ శ్రీను`, `బలుపు`, `క్రాక్` చిత్రాలు విజయాలు సాధించాయి. దీంతో నాల్గోసారి కలిసి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. భారీ స్థాయిలో ఈ కాంబినేషన్ని అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. `ఆర్టీ4జీఎం`గా దీన్ని రూపొందించాలని ప్లాన్ చేశారు. బాలీవుడ్ స్టయిల్లో అనౌన్స్ మెంట్ కూడా చేశారు. మరోసారి మాస్ కాంబోలో హిట్ రాబోతుందని అంతా భావించారు. కానీ తీరా పెద్ద ట్విస్ట్ నెలకొంది. తాజాగా ఈ మూవీ ఆగిపోయిందట.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమాని ఆపేశారట. మరి దీనికి కారణాలు ఏంటనేది చూస్తే.. బడ్జెట్ సమస్య అని తెలుస్తుంది. సినిమాని భారీ బడ్జెట్తో ప్లాన్ చేశారు. వీరి కాంబోలో మంచి విజయాలు ఉండటంతో బడ్జెట్ సమస్య లేదని భావించి సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు నిర్మాతలు. కానీ ఇప్పుడు బడ్జెట్ విషయంలో వెనకడుగు వేస్తున్నారట. రవితేజ గత చిత్రాల ఫలితాలు చూసి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఆయనపై ఎక్కువ బడ్జెట్ పెడితే రిస్క్ అని భావించి వెనక్కి తగ్గినట్టు సమాచారం.
రవితేజ నటించిన `ధమాఖా` మూవీ వందకోట్లు వసూలు చేసింది. అలాగే చిరంజీవితో కలిసి నటించిన `వాల్తేర్ వీరయ్య` రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై భారీగా పెట్టొచ్చు అనుకున్నారు. కానీ తర్వాతి సినిమాలు చూశాక నిర్మాతలు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ మూవీ ఆల్మోస్ట్ గా ఆగిపోయినట్టే అంటున్నారు.
ఇటీవల రవితేజ.. హరీష్ శంకర్తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మూవీ ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరుగుతుంది. గోపీచంద్ మలినేని మూవీ ఆగిపోవడంతోనే రవితేజ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట. అలా ఇఇది చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ సమ్మర్లోనే రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటే ఇదంతా రవితేజ స్వయంకృపరాథమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన దర్శకుడిని నమ్మి సినిమాలు చేస్తూ వచ్చారు. తన హిట్ ట్రాక్ని పక్కన పెట్టి మరీ చాలా వరకు డైరెక్టర్లకి లైఫ్ ఇవ్వాలని భావించి చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్ని ప్రయోగాలు చేశారు, మరికొన్ని ఫెయిల్యూర్ డైరెక్టర్లతోనూ సినిమాలు చేశారు. అదే ఆయనకు ముప్పుగా మారుతుంది. వరుస పరాజయాలు ఆయన మార్కెట్ని దెబ్బతీస్తున్నాయి. ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఒక రేంజ్కి వచ్చాక సెలక్టీవ్గా సినిమాలు చేయాల్సింది పోయి, వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ వెళితే ఫలితాలు ఇలానే ఉంటాయని నెటిజన్లు, ఆయన అభిమానులు అంటున్నారు. ఇకనైనా రవితేజ చాలా సెలక్టీవ్గా మూవీస్ చేయాలని కోరుకుంటున్నారు.