Asianet News TeluguAsianet News Telugu

ఎరక్క పోయి ఇరుక్కున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. కేసు నమోదు..

పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్‌ బాబ్జీ.. న్యాయవాది డొంకెన రవి ద్వారా పాయల్‌రాజ్‌పుత్‌, షాపింగ్‌ మాల్‌ యాజమాని వెంకటేశ్వర్లు, అతడి భార్య మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్ట్ లో 12న పిటిషన్‌ దాఖలు చేశారు.

case filed on heroine payal rajput in peddapalli
Author
Hyderabad, First Published Aug 21, 2021, 7:33 AM IST

`ఆర్ఎక్స్ 100` భామ పాయల్‌ రాజ్‌పుత్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గత నెల 11న ఈ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో పాయల్‌, షాపు యాజమాన్యం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్‌ బాబ్జీ.. న్యాయవాది డొంకెన రవి ద్వారా పాయల్‌రాజ్‌పుత్‌, షాపింగ్‌ మాల్‌ యాజమాని వెంకటేశ్వర్లు, అతడి భార్య మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్ట్ లో 12న పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించారు. ఇందులో భాగంగా పాయల్‌తోపాటు షాపింగ్‌ యాజమానిపై పోలీసులు ఇరవై రోజుల క్రితం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ రాజేష్‌ వెల్లడించారు. 

దీంతో ఎరక్కపోయి ఇరుక్కున్నట్టయ్యింది పాయల్‌ పరిస్థితి. `ఆర్‌ఎక్స్ 100`తో పాపులర్‌ అయిన పాయల్ రాజ్‌పుత్‌.. హీరోయిన్‌గా రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆ స్థాయి హిట్‌ కోసం వేచిచూస్తుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో `ఏంజెల్‌`, తెలుగులో `కిరాతక` చిత్రాల్లో నటిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios