బిత్తిరి సత్తి... మరో ఛానెల్ లో పోగ్రామ్ ఫిక్స్
బిత్తిరి సత్తే టీవీ 9 నుంచి రాజీనామా చేశాడని, కాదు.. బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి కొత్త అవతారం ఎత్తనున్నాడు.
తీన్మార్ వార్తలతో సుపరిచితుడైన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ రీసెంట్ గా టీవీ9కు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే టీవీ9 కావాలనే సత్తిని పంపేసిందని కొందరు..అటువంటిదేమీ లేదు...సత్తే రాజీనామా చేశాడని, కాదు.. బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి మరొక ఛానెల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మీడియా వర్గాల నుంచి అందుతునన సమాచారం మేరకు...ఇకపై బిత్తిరి సత్తి.. సాక్షి టీవీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ఆ టీవీ చానల్ యాజమాన్యంతో సత్తి మాటలు జరిగినట్లు తెలుస్తోంది. రెమ్యునేషన్ విషయానికి వస్తే.. ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో తన రేటు పెంచకుండా...టీవీ9 వారు అందజేసిన ప్యాకేజీ మొత్తానికే సత్తి ఓకే చెప్పాడని చెప్పుకుంటున్నారు.
ఇదే కనకు నిజమై.... సత్తి ఇక సాక్షి టీవీలో కనిపించనున్నాడు. అయితే అందులో కూడా ఇస్మార్ట్ వార్తల పేరిటే ఏదైనా కార్యక్రమం పెడతారని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు వీ6 న్యూస్, టీవీ9లలో సత్తి రెండు భిన్న గెటప్లలో అలరించాడు. కానీ సాక్షిలో మరో కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే... 'బిగ్బాస్ సీజన్ 4' లో బిత్తిరి సత్తి ఎంపికైనట్లు మరో వర్గం అంటోంది. బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టేందుకు సత్తి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్లు వినికిడి. కాగా ఇప్పటికే బిగ్బాస్ పోగ్రామ్ నిర్వాహకులు పార్టిసిపెంట్ల వెతకటం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనూ కొందరి పేర్లు లీక్ అయ్యాయి.తాజాగా వీరి సరసన సత్తి చేరాడు. అయితే చివరాఖరికి బిగ్బాస్ నిర్వాహకులు ఎవరిని ఖరారు చేయనున్నారో చూడాలి. గతంలో బిత్తిరి సత్తితో పాటు వార్తలు చదివి పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి కూడా బిగ్బాస్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.