ఆలయంలో ఆలియాభట్-రణ్ బీర్ కపూర్ దంపతులకు అవమానం, లోపలికి రావద్దంటూ...?
బాలీవుడ్ అందమైన జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ దంపతులకు చేదుఅనుభవం ఎదురయ్యింది. ఒక రకంగా అవమానం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లిన వారిని గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు కొందరు. కారణం ఏంటి..?
బాలీవుడ్ రియల్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం వారు బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో బీజీ బిజీ గా ఉన్నారు. ఇందులో భాగంగా దేశమంతా తిరుగుతున్నఇద్దరు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళ్లారు. అక్కడ ఈ యంగ్ కపుల్ ను గుడిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు.
అయితే వీరిని గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుంది భజరంగ్ దళ్ కార్తకర్తలుగా తెలిసింది. గతంలో ఆలియా- రణ్ బీర్ లు చేసిన న కామెంట్స్ ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరు బీఫ్ (గొడ్డు మాంసం) తినే విషయంలో క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ కామెంట్లకు నిరసనగా భజరంగ్ దళ్ కార్యకర్తలు టెంపుల్ లోకి వెళ్లకుండా వీరిని అడ్డుకున్నట్టు తెలుస్తోంది.
ఆలియా - రణ్ బీర్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఉజ్జయిని దర్శనానికి వచ్చిన ఈ జంటతో పాటు.. మూవీ టీమ్ ను కూడా లోపలకు వెళ్లకుండా... నల్ల జెండాలు పట్టుకొని వచ్చి బజరంగ్ కార్తకర్తలు అడ్డుకున్నారు. వాళ్లను ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు.
ఇక గతంలో ఆలియా భట్ తో పాటు రణ్ బీర్ విడిగా చేసిన కామెంట్లు చూస్తే.. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని అలియా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తను బీఫ్ ను చాలా ఇష్టంగా తింటానని చెప్పింది. అయితే దానికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతే కాదు కొన్ని రోజుల కిందట రణ్ బీర్ కూడా తాను మటన్, చికెన్ తో పాటు బీఫ్ తింటానని చెప్పాడు. దాంతో, అలియా, రణ్ బీర్ లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మాస్త్రా రిలీజ్ వేళ వీరికి వరుస ఇబ్బందులు తప్పడం లేదు. అసలే బాలీవుడ్ ప్రెజర్ కుక్కర్ లో ఉడుకుతోంది. మరోవైపు బ్రహ్మాస్త్ర సినిమాను బాయ్ కాట్ చేయాలని పలువురు నెజిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు బాయ్ కాట్ బాలీవుడ్.. బాక్ కాట్ బ్రహ్మాస్త్ర హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. వీటన్నింటికి ఆజ్యం పోసేట్టు ఆలియా చేసిన కామెంట్స్ మంటలు రేపుతున్నాయి. దీనిపై స్పందించిన అలియా.. సినిమాను చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే మానేయండి అని కామెంట్ చేసింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తున్నారు.
ఎటు తిరిగి సినిమా టీమ్ దైవ దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. కాని చివరికి దర్శకుడు అయాన్ ముఖర్జీకి మాత్రం పర్మిషన్ ఇవ్వడంతో ఆయన ఒక్కరే దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటీ అంటే.. సినిమా రిలీజ్ సందర్భంగా.. భర్త రణ్ బీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి దైవ దర్శనానికి వస్తున్నట్టు అలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్ చూసిన భజ రంగ్ దళ్ కార్యకర్తలు ఆలయం దగ్గరకు వచ్చి వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.