Asianet News TeluguAsianet News Telugu

రాక్షసులు ఎక్కడో లేరు... సెన్సేషనల్ వీడియో షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్!


యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ఆవేదన చెందుతూ ఓ భయంకరమైన వీడియో షేర్ చేశారు. 
 

anchor rashmi gautam post a video calls them devils ksr
Author
First Published Jun 9, 2023, 6:01 PM IST


యాంకర్ రష్మీ యానిమల్ లవర్. మూగ జీవాలకు ఏ రూపంలో అన్యాయం జరిగినా సహించలేరు. వ్యతిరేకంగా గళమెత్తుతారు. జీవ హింసకు పాల్పడే వారి మీద సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారు. చాలా కాలంగా రష్మీ గౌతమ్ ఈ కార్యక్రమం చేస్తున్నారు. అనిమల్ లవర్ గా ఆమె వీగన్ గా మారారు. అంటే మాంసాహారమే కాదు జంతువుల ఉత్పత్తులైన పాలు, గుడ్లు వంటివి కూడా తినరు. ఇక జీవహింసకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ అవగాహన కలిగిస్తూ ఉంటారు. జీవహింస పాపం అంటూ వెలుగెత్తుతారు. 

తాజాగా పదుల సంఖ్యలో తిమింగలాలను సంహరిస్తున్న వీడియో ఆమె ట్వీట్ చేశారు. ఆ వీడియో అత్యంత దారుణంగా ఉంది. తిమింగలాల రక్తంతో సాగర తీరం ఎర్రగా మారిపోయింది. ఆ వీడియోలో తిమింగలాలను చంపుతున్న వ్యక్తులను ఉద్దేశిస్తూ ఆమె ఓ కామెంట్ చేశారు. రాక్షసులు ఎక్కడో లేరు. ఇలాంటి వాళ్ళ రూపంలో మనతోనే ఉన్నారు, అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. రష్మీ ట్వీట్ వైరల్ అవుతుంది. 

ఇటీవల హైదరాబాద్ లో ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించాడు. అప్పుడు రష్మీ గౌతమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మనుషుల ప్రాణాలకంటే వీధి కుక్కల ప్రాణాలే ఎక్కువగా అంటూ ఆమెను టార్గెట్ చేశారు. అయినప్పటికీ రష్మీ గౌతమ్ తన సిద్ధాంతం వీడలేదు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అంటూ కౌంటర్లు ఇచ్చారు. వీధి కుక్కల తప్పేమీ లేదన్నట్లు మాట్లాడారు. 

మరోవైపు రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. హీరోయిన్ గా మాత్రం ఆమె జోరు తగ్గింది. ఒకప్పుడు అనసూయను వెనక్కి నెట్టి హీరోయిన్ గా దూసుకుపోయింది రష్మీ. ఇప్పుడు అనసూయ టాప్ గేర్ లో పరుగులు తీస్తుంది. హీరోయిన్ గా రష్మీకి అవకాశాలు రావడం కష్టమే. యాంకరింగ్ గా మాత్రం ఢోకా లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios