కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడు. ఇటు సినిమాలు చేస్తూనే అటు స్పోర్డ్స్ పై దృష్టి పెట్టాడు. బేసిక్ గా బైక్ రేసర్ అయిన అజిత్.. మరో వైపు రైఫిల్ షూటింగ్ లో కూడా సత్తా చాటుతున్నాడు.
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ స్థానం గురించి ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చాలా సార్లు నిరూపించకున్నాడు. రీసెంట్ గా మల్టీ టాలెంటెడ్ అని కూడా నిరూపించుకుంటున్నాడు అజిత్ రీసెంట్ గా రైఫిల్ పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు అజిత్ కుమార్.
47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అజిత్ పాల్గొంటున్నాడు. ఈ పోటీలు ఈ నెల 25న మొదలు కాగా, పోటీ రెండో దశలో పాల్గొనేందుకు అజిత్ తిరుచ్చి చేరుకున్నాడు. అజిత్ రైఫిల్ షూటింగ్లో మంచి నైపుణ్యం ఉంది. 2021 తమిళనాడు స్టేట్ రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆయన ఆరు మెడల్స్ సాధించారు.
దీంతో ఈ సారి కూడా రైఫిల్ పోటీల్లో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. 10 మీటర్లు, 25 మీటర్లు, 50 మీటర్ల విభాగంలో ఆయన ప్రాథమిక దశల్లో పాల్గొన్నారు. తిరుచ్చి రైఫిల్ క్లబ్ కు చేరుకున్న ఆయనకు అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించింది. దీంతో ఆయన థంబ్స్ అప్ సంకేతం ఇచ్చారు.
స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా హీరోగానే కాదు బైక్ రేసర్ గా కూడా ఉన్నారు. ఆయన స్పోర్డ్స్ బైక్స్ తో రేసులకు వెళ్తుంటారు, లాంగ్ డ్రైవ్ చేస్తూ.. దేశమంతా తిరుగుతుంటారు. ఇక ప్రస్తుతం అజిత్ ఏకే 61 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నయనతార భర్త యండ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలోఓ మూవీలో నటించనున్నారు.