Asianet News TeluguAsianet News Telugu

విజయ్ హాజారే ట్రోఫీపై కరోనా పంజా... ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్...

ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్...

ఐసోలేషన్‌కి తరలించిన అధికారులు...

మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బీహార్ క్రికెటర్లకు కరోనా భయం...

Three Indian players tested positive for Corona Virus in Vijay Hazare Trophy CRA
Author
India, First Published Feb 24, 2021, 8:21 PM IST

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ సక్సెస్ తర్వాత విజయ్ హాజారే ట్రోఫీని నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో సీనియర్, జూనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే విజయ్ హాజారే ట్రోఫీకి అనుకోని అవాంతరం ఎదురైంది.

ఈ టోర్నీలో పాల్గొంటున్న ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకినట్టు సమాచారం...మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఒక్కో ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు బీసీసీఐ తెలియచేసింది. వీరిని వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు, మిగిలిన ప్లేయర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

విజయ్ హాజారే ట్రోఫీలో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న భారత జట్టు సభ్యులు శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా వంటి ప్లేయర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios