Asianet News TeluguAsianet News Telugu

శిఖర్ ధావన్‌ చెత్త రికార్డు... వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

శిఖర్ ధావన్ గోల్డెన్ డకౌట్... సున్నాకే పెవిలియన్ చేరిన సంజూ శాంసన్...

నిరాశపరిచిన దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్...

 

Team India losses four early wickets after back to back wickets CRA
Author
India, First Published Jul 29, 2021, 8:30 PM IST

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. టీ20ల్లో మొదటి బంతికే డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు ధావన్.

ఇంతకుముందు భారత రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు సార్లు డకౌట్ అయినా ఎప్పుడూ మొదటి బంతికే అవుట్ కాలేదు. 15 బంతుల్లో 1 ఫోర్‌తో 9 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. పడిక్కల్‌‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసేందుకు బౌలర్ అప్పీలు చేస్తుండగా పరుగు కోసం ప్రయత్నించి ముందుకొచ్చి రనౌట్ అయ్యాడు. 

ఆ తర్వాత సంజూ శాంసన్ కూడా డకౌట్ కాగా... రుతురాజ్ గైక్వాడ్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత నితీశ్ రాణా కూడా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. 36 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

Follow Us:
Download App:
  • android
  • ios