Asianet News TeluguAsianet News Telugu

టీం ఇండియా మహిళల జట్టుకి భారీ షాక్..

 గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్‌ భారం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లపై పడనుంది. 

Smriti Mandhana Ruled Out Of South Africa ODI Series With Fractured Toe
Author
Hyderabad, First Published Oct 9, 2019, 2:15 PM IST

టీం ఇండియా మహిళల జట్టుకి ఊహించని  షాక్ తగిలింది.  త్వరలో దక్షిణాఫ్రికా సిరీస్ జరగనున్న సమయంలో  టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన గాయాలపాలయ్యారు. ఆమె బొటన వేలికి గాయం తగిలింది. దీంతో ఆమె దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకున్నారు.

మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆమె గాయపడ్డారు. వెంటనే వైద్యులు వైద్యం అందించినప్పటికీ.. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్‌ భారం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లపై పడనుంది. 

ఇక దక్షిణాప్రికాతో మూడు వన్డేల సిరీస్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టుకు తొలి ఓవర్‌ తొలి బంతికే గోస్వామి షాక్‌ ఇచ్చింది. లిజాలే లీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లతో విజృంభించడంతో 56 పరుగులకే మూడు కీలక వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. ఇక ఇప్పటికే టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే ఉత్సాహంలో ఉంది. అయితే వన్డే సిరీస్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ జట్టు భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios