Asianet News TeluguAsianet News Telugu

గిల్ డకౌట్, సూర్యకుమార్ ‘డబుల్’ డక్... 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

శుబ్‌మన్ గిల్ డకౌట్... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్... 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 

Shubman Gill, SuryaKumar Yadav goes for ducks, rohit sharma, India vs Australia 2nd ODI cra
Author
First Published Mar 19, 2023, 2:07 PM IST

వైజాగ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 2 బంతులాడిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి లబుషేన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదిలించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ అదే స్టైల్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఐదో ఓవర్ బౌలింగ్‌ చేసిన మిచెల్ స్టార్క్, మెయిడిన్ ఓవర్ వేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న వైజాగ్ పిచ్‌పై టీమిండియా 300+ స్కోరు చేస్తుందని ఆశించారు అభిమానులు. అయితే నిన్న కురిసిన వర్షం కారణంగా పిచ్‌లో మిగిలిన తేమ, వాతావరణం రెండూ కూడా ఆస్ట్రేలియాకి అనుకూలంగా మారాయి...

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబైలో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన ఆస్ట్రేలియా, వన్డే సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. లేదంటే టీమిండియా 2-0 తేడాతో వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంటుంది. బామ్మర్ది పెళ్లి కోసం తొలి వన్డేలో ఆడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు...

నేటి మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీతో ఓపెనర్‌గా వచ్చి, ఫెయిల్ అయిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... టీమ్ నుంచి తప్పుకున్నాడు. అలాగే తొలి వన్డేల్లో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కింది.. 

మరో వైపు ఆస్ట్రేలియా కూడా నేటి మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగుతోంది. గాయం కారణంగా తొలి వన్డేలో ఆడని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. దీంతో గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆసీస్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్, రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అలాగే ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్లేస్‌లో నాథన్ ఎల్లీస్‌కి అవకాశం కల్పించింది ఆస్ట్రేలియా...

Follow Us:
Download App:
  • android
  • ios