Asianet News TeluguAsianet News Telugu

ఆట మర్చిపోయి రోహిత్- ధోనీ ముచ్చట..వీడియో వైరల్

చెన్నై, ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో చివరకు విజయం ముంబయికే దక్కింది. చెన్నై భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. రోహిత్ సేన చాలా సులభంగా ఆ లక్ష్యాన్ని చేధించడం గమనార్హం.
 

Rohit Sharma Conversation With MS Dhoni After Mumbai Indians Beat Chennai Super Kings in IPL 2021 Game Goes Viral
Author
hyderabad, First Published May 2, 2021, 8:39 AM IST

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఖాతాలో మరో విజయం నమోదైంది. ఈ ఐపీఎల్ సీజన్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైకి నిన్నటి మ్యాచ్ లో ముంబయి బ్రేక్ వేసింది. చెన్నై, ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో చివరకు విజయం ముంబయికే దక్కింది. చెన్నై భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. రోహిత్ సేన చాలా సులభంగా ఆ లక్ష్యాన్ని చేధించడం గమనార్హం.

219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పొలార్డ్‌ (87 నాటౌట్‌, 34 బంతులు;  6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.


కాగా, మ్యాచ్‌ తర్వాత ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ-సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిలు మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఇద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకుంటూ గేమ్‌లోని విశేషాలను పంచుకున్నారు. మ్యాచ్‌లో ఎంత ప్రత్యర్థులుగా తలపడినా ఆఫ్‌ ఫీల్డ్‌లో మాత్రం ధోని-రోహిత్‌లు ఇలా కనబడటం ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది. ఇది కదా గేమ్‌ స్పిరిట్‌ అంటూ అభిమానులు తెగముచ్చపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ చేయగా... మొయిన్‌ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్‌కు ఐపీఎల్‌లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది.

Follow Us:
Download App:
  • android
  • ios