Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో అతిపెద్దది... మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

గుజరాత్ లో భారీ నిధులు కేటాయించి ప్రతిష్టాత్మకంగా పునర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. 

president Ramnath Kovind Inaugurate motera stadium
Author
Ahmedabad, First Published Feb 24, 2021, 1:01 PM IST

అహ్మదాబాద్: గుజరాత్ లో భారీ నిధులు కేటాయించి ప్రతిష్టాత్మకంగా పునర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు తో పాటు గుజరాత్ సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.  

అత్యాధునికి సదుపాయాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాలో మంగళవారం మధ్యాహ్నం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ డే నైట్ మ్యాచ్ లో గెలిచి టెస్ట్ సీరిస్ లో ముందంజ వేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాకుండా పునర్మిర్మాణం తర్వాత జరుగుతున్న మొదటి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా, మిగిలిన రెండు టెస్టులను అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా ఆడనుంది. పున:నిర్మించిన ఈ స్టేడియంలో అత్యధునిక సదుపాయల మధ్య 55 వేల మంది (పూర్తి కెపాసిటీ లక్షా 10 వేల మంది) మూడో టెస్టు డే- నైట్ మ్యాచ్‌గా జరగనుంది.

చిట్టచివరిసారిగా 2012 నవంబరులో చివరిసారిగా టెస్టు మ్యాచుకి వేదికనిచ్చింది మొతేరా స్టేడియం. 2012లో నవంబర్ 15 నుంచి 19 వరకూ జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది... ఆ మ్యాచ్ సమయానికి ఇంగ్లాండ్ ప్రస్తుత కెప్టెన్ జో రూట్ ఇంకా టెస్టు ఆరంగ్రేటం కూడా చేయకపోవడం విశేషం.

మొతేరా స్టేడియంలో పిచ్ ఎలా స్పందిస్తుందో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలక పాత్ర పోషించబోతోంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఆడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఎదురైన పరాభవం నుంచి తొందరగానే కోలుకున్న భారత జట్టు, ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో దక్కిన విజయంతో విజయోత్సాహంతో ఉంది. మూడో టెస్టులో ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య విజయం సాధిస్తే, నాలుగో టెస్టులో గెలవడం అంత కష్టమేమీ కాదు.

అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇప్పటిదాకా ఐదుగురు క్రికెటర్లు డబుల్ సెంచరీలు చేశారు. శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్థనే 275 పరుగులతో ఇక్కడ టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ ద్రావిడ్ 222, ఏబీ డివిల్లియర్స్ 217 (నాటౌట్), సచిన్ టెండూల్కర్ 217, పూజారా 206 (నాటౌట్) ఇక్కడ ద్విశతకాలు బాదారు. ఇక మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టు పై 2 మ్యాచులు ఆడిన టీమిండియా ఒకదాంట్లో గెలిచి, ఓదాంట్లో ఓడింది. శ్రీలంకపై మూడు మ్యాచులు ఆడగా రెండు గెలిచి, ఒకటి డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్‌పై మూడు మ్యాచులు ఆడితే, మూడూ డ్రాగా ముగిశాయి.

 విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా మొతేరా స్టేడియంలో ఇది మొదటి మ్యాచ్. అయితే ఇక్కడ ఏడుగురు భారత కెప్టెన్లు టెస్టులకు సారథ్యం వహించారు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఇక్కడ మూడు మ్యాచులు ఆడగా ఓ దాంట్లో గెలిచి, రెండు డ్రా చేసుకుంది టీమిండియా. సచిన్ టెండూల్కర్ ఓ విజయం, ఓ డ్రా ఇవ్వగా, గంగూలీ సారథ్యంలో రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios